లోన్ స్టార్ తో సినిమా తీయాలనుకున్నాడు దర్శకుడు సిహెచ్.పాఠి. ఇలా చెబితే, లోన్ స్టార్ అభిమానులకు కోపం వస్తుందని, ‘నేను లోన్ స్టార్ తో సినిమా తీయాలని పదేళ్ళనుంచి తపస్సు చేస్తుంటే, ఇప్పటికి డేట్స్ ఇచ్చారు’ అని వేరే ఏదో సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో అభిమానుల ‘ఈలల’ మధ్య (వాళ్ళు చప్పట్లు కొట్టరు.) ప్రకటించారు.
Category: తకిటతక..తోముతా
ఆంధ్రభూమి దినపత్రికలో ప్రతి ఆదివారం ప్రచురితమవుతున్న కాలమ్
‘ఆత్మ’ రాముడు నటిస్తాడా?
నేడు స్నేహ దినోత్సవం.స్నేహానికి నిర్వచనం చెప్పాల్సి వచ్చినప్పుడెల్లా సినిమా రంగం నుంచి ‘బాపు-రమణ’లను ఉదహరించేవారు. కానీ వైయస్ తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మరో ఉదాహరణ రాజకీయ రంగంనుంచి దొరికేసింది. ‘వైయస్-కె.వి.పి’లను ఆ రీతిలో కీర్తించటం మొదలు పెట్టారు.( వారికి ఇలాంటి స్నేహం దశాబ్దాల నుంచీ వుండవచ్చు. కానీ ఆ విషయం లోకానికి కాస్త అలస్యంగా తేటతెల్లమయింది.) ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో ఎప్పుడూ రెండు పాత్రలు కనిపిస్తుండేవి. ఒకటి ‘ఆత్మ’, రెండు ‘నీడ’. ఆత్మ- కె.వి.పి రామ చంద్ర రావు అయితే, నీడ-సూరీడు. కానీ పాపం. వైయస్ చివరిసారిగా హెలికాప్టర్ ఎక్కినప్పుడు మాత్రమే ‘ఆత్మ’నీ, ‘నీడ’నీ వదలేశారు.
పెద్ద కుర్చీలో ‘చిరు’ నేతా?
రాష్ట్రంలో ‘అకాల’ జ్ఞానులు పెరిగిపోతున్నారు. అడక్కపోయినా, ఆపి మరీ జోస్యం చెప్పేస్తున్నారు. చంద్ర శేఖర సిధ్ధాంతి (కె. చంద్రశేఖరరావు) హఠాత్తుగా వచ్చే నెలలో(సెప్టెంబరులో) తెలంగాణ తేలిపోతుందంటారు. ఈయనకు గతంలో కూడా ఇలాంటి జ్యోతిషం చెప్పిన అనుభవం వుంది. కానీ ఆంధ్ర నుంచి, ఇంకో సిధ్ధాంతి బయిల్దేరారు. ఆయనే రామచంద్ర సిధ్ధాంతి( గుడుల మంత్రి సి.రామచంద్రయ్య). చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని ద్వారాకా తిరుమలలోని ‘కాపు కళ్యాణమంటపం’లో చెప్పారు. వీరు హాస్యాలాడుతున్నారా? లేక జోస్యాలాడుతున్నారా? రాజకీయాల్లో రెంటికీ పెద్ద తేడా ఏమీ వుండదు లెండి.
తుంటరి ‘చేతి’కి ఒంటరి ‘గులాబి’
ఒకప్పుడు ‘సమైకాంధ్ర’ నినాదమిచ్చిన సీమాంధ్ర నేతలెవరూ, తెలంగాణ గడ్డ మీద కేసీఆర్కు ఎదురు నిలువ లేదు. ఆ మాట కొస్తే ఉద్యమం ఉధ్ధృతం అయ్యాక కాలు కూడా మోప లేదు. అలాంటిది- ఒకప్పుడు ఇదే కారణం మీద మహబూబా బాద్ నుంచి వెనుతిరిగిన వై.యస్ జగన్, తన తల్లి(విజయమ్మ)నీ, చెల్లి(షర్మిల)నీ తెలంగాణ ఉప ఎన్నికకు ప్రచారానికి పంపిస్తే, కేసీఆర్ చోద్యం చూశారు. అంతే కాదు, పరకాలలో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, టీఆర్ఎస్ అభ్యర్థికి ‘నువ్వా-నేనా’ అన్నంతటి పోటీ ఇచ్చి ముచ్చెమట్లు పోయించారు. స్వల్ప ఆధిక్యంతో టీఆర్ఎస్ పరువు నిలుపు కున్నది కానీ, పట్టు కోల్పోయింది.
ఒక్క ‘ఆవిడి’యా రాజకీయాన్నే మార్చేస్తుంది!
‘కుటుంబ నియంత్రణ పాటించాలయ్యా?’
‘నాకున్నది ఇద్దరే కదా సర్!’
‘నేనడిగేది పిల్లల గురించి కాదు, కుటుంబాల గురించి.’
‘అయతే… మూడండి.’
ఈ సంభాషణ ఓ అధికారికీ, ఆయన కింద పనిచేసే ఉద్యోగికీ మధ్య జరిగింది.
నిజమే ఒక్కొక్కరూ పెద్దిల్లు కాకుండా చిన్నిల్లూ, బుల్లిల్లూ, చిట్టిల్లూ- ఇలా పెట్టుకుంటూ పోతుంటే, ‘కుటుంబాలు’ పెరిగిపోవూ? అవును కుటుంబాలంటే, పిల్లలు కాదు, భార్యలే.
పచ్చ బొట్టూ చెరిగీ పోదూలే..!
చరిత్రంటే- పేరూ, ప్రతిష్ఠలు మాత్రమే కాదు; మచ్చలూ, బొట్లూ కూడా. చెరపటం అంత చిన్న విషయం కాదు. పుట్టు మచ్చంటే, పుట్టు మచ్చే. చచ్చినా చెరగదు. పచ్చ బొట్టూ అంతే. మోజు పడి పొడిపించుకున్నంత ‘వీజీ’ కాదు- చికాకు పడి చెరిపేసుకోవటానికి. ముళ్ళపూడి వెంకటరమణ (‘ముత్యాల ముగ్గు’ కోసం) రాసినట్టు, ‘సెరిత్ర.. ! సెరిపేత్తే సెరిగి పోదు, సింపేత్తే సిరిగి పోదు.’
ఈ రహస్యం మన రాష్ట్ర మంత్రులకు అర్థమయి నట్లు లేదు. అందుకే ‘గోడ మీద రాతల్ని’ చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ సంక్షేమ పథకం మీదా ‘రాజ’ ముద్ర వుండటానికి వీల్లేదు.(అదే లెండి. రాజశేఖర రెడ్డి ముద్ర.)- అంటూ ‘ధర్మాన’ పీఠం దద్దరిల్లింది.
కుర్చీలందు గోడకుర్చీలు వేరయా!
కుర్చీ కే కాదు, కుర్చీ పక్కన కుర్చీకి కూడా విలువ వుంటుందని రాజనీతిజ్ఞులు ఘోషిస్తున్నారు.
క్లాస్ రూమ్లో ఒకే ఒక కుర్చీ వుంటుంది. దాంట్లో టీచర్ కూర్చుంటారు. దాని పక్కన వేరే కుర్చీ వుండదు. కాబట్టి, విద్యార్థులకు కుర్చీ గురించే తెలుస్తుంది కానీ, పక్క కుర్చీ గురించి తెలీదు. కాక పోతే, హోమ్ వర్క్ చేయని విద్యార్థుల చేత మాత్రం పూర్వం ‘గోడ కుర్చీ’ వేయించే వారు. అంటే లేని కుర్చీని వున్నట్టుగా భావించి కూర్చోవటం. అది కూడా టీచర్ పక్కనే అలా కూర్చోవాలి.
కాబట్టే కుర్చీల గురించి చిన్నప్పుడు కలిగిన జ్ఞానమొక్కటే: ఉన్న కుర్చీలో కూర్చోవటం గౌరవం; లేని కుర్చీలో కూర్చోవటం శిక్ష.
మోడీ, గోద్రా, ఒక తమిళ అమ్మాయి!?
దేహమంటే మట్టి కాదోయ్, దేహమంటే కోర్కెలోయ్!
ఇలాగని ఎవరంటారు? ‘దేహ’ భక్తులంటారు. దేశ భక్తుల్లాగే దేహభక్తులుండటం విడ్డూరం కాదు. కానీ ‘దేశభక్తుల్లో’ కూడా ‘దేహ’భక్తులుండం ఆశ్చర్యమే.
సర్వసంగ పరిత్యాగులూ, కాషాయాంబర ధారులూ ‘నిత్యానందులయి’ దేహాల కోసం పరితపించటం కొత్త విషయమేమీ కాదు.
ప్రజాసేవ కోసం తమ అణువణువూ అర్పించేస్తామని ఊరేగే రాజకీయనాయకులూ, ప్రజా ప్రతినిథులూ, దేశభక్తులూ, ఇలా ‘దేహాల వేట’లో వుండటం కూడా వింత కాదు కానీ, దొరికి పోవటం వార్త. ఇటీవలి కాలంలో ఇలాంటి ‘శృంగార పురుషుల’ భాగోతాలు ప్రసారం చేసి బుల్లితెర మరింత చిన్నబోతోంది.
సిఎం సీటు ‘బీసీ’కా? ‘సీబీ’కా?
వంద సీట్లు. వెయ్యి కోట్లు. లక్ష ఫీట్లు.
ఇవీ బీసీల వోట్ల కోసం చంద్రబాబు పాట్లు.
ఇది విజన్ 2020 కాదు, రీజన్ 2014.
అనుమానం లేదు. ఇది ఎన్నికల గణితమే. ఆయన లెక్కల్లో మనిషి. ఇంతకు ముందు ఎన్నికల్లో ఇలాగే ‘నగలు బదలీ’ లెక్కలు వేశారు. ‘ఆల్ ఫ్రీ’ కూడికలు వేశారు. కానీ జనానికి ‘తీసివేత’లే అర్థమయ్యాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ‘తీసి వేశారు’.
‘రాణి’నీతి లేదా?
అప్పుడు రాణిని ‘కొప్పుపట్టి ఈడ్చుకు రమ్మని’ ధుర్యోధనుడు శాసిస్తే, దుశ్సాసనుడు అమలు చేస్తాడు. నిండు సభలో వలువలు వలుస్తారు. ఉత్త ‘నీతి’ని వల్లించే పెద్దలు అచేతనులయి చూస్తారు.
భారతం, భారతమే. ‘కళ్ళుమూసుకుని’ పాలించే పాలకులున్న చోట, దేశంలోని అంగుళం, అంగుళమూ కురుసభగానే మారిపోతుంది. అందాకా గువహతి(అసోం)లో ఒక ‘ఆరు బయిట’ (అదేలెండి ‘బారు బయిట’) నాలుగు రోజుల క్రితం ఈ కురుసభను నిర్వహించారు.
ఊరించిన విషయానికి కిక్కెక్కువ!
అబధ్ధం చురుకయినది. పుట్టగానే పరుగెత్తుతుంది.
నిజం సోమరి. వెళ్ళవచ్చులే- అని బధ్ధకిస్తుంది.
పుకారు కున్న స్పీడు, వార్తకు వుంటుందా? పుకారును వ్యాప్తి చేయటానికి ప్రత్యేకించి ప్రసార సాధనం అవసరం లేదు. దానంతటదే వ్యాప్తి చెందుతుంది. కానీ, వార్తకంటూ ఒక సాధనం వుండాలి.
అందుకే అంటారు మరి- ‘సత్యం చెప్పులు వేసుకునేలోగా అసత్యం లోకం చుట్టి వస్తుందని’.
కారణం మార్కెట్. అబధ్దానికున్న డిమాండ్, నిజానికి వుండదు. అబధ్ధానికి ఎదురువెళ్ళి స్వాగతిస్తారు. అసత్యవాక్కులను ఎగబడి కొంటారు.
కేంద్రంలో ‘పంబలకిడి జంబ’
రాజకీయంగా దేశం ఎలా వుంది? ఏదో గాలివాన వచ్చి కొట్టేసినట్టుంది. మహా వృక్షాలు కూలిపోయాయి. చిన్న చిన్న మొక్కలు తలలెత్తి నిలుచున్నాయి. జాతీయ పక్షాలు జాలిగొలిపే పార్టీలుగా కూలబడిపోతుంటే, ప్రాంతీయ పక్షాలు పెత్తనం చేసే పార్టీలుగా స్థిరపడిపోతున్నాయి.
ఇదే పరిస్థితి కొనసాగితే, 2014లో పరిస్థితి ‘జంబలకిడి పంబ’ కాస్తా, ‘పంబలకిడి జంబ’ అయ్యే లా వుంది. (పురుషులపై స్త్రీలు ఆధిపత్యం చెలాయించటం ‘జంబలకిడి పంబ’ అయితే, పెద్దలపై పిల్లలు ఆధిపత్యం చేయటం ‘పంబలకిడి జంబ’ అని ఒక సినిమాలో సూత్రీకరిస్తారు.)
బాబూ! చినబాబు వచ్చారా?
డాక్టర్ కొడుకు డాక్టరే ఎందుకవ్వాలి? పొడవటానికి. ఎవర్నీ? పేషెంట్ కొడుకుని.
పేషెంట్ కొడుకు పేషెంట్ గానే పుడతాడు. ఆరోగ్యవంతుడిగా పుట్టడు. అది రూలు. కొడుకును రంగంలోకి దించాలనుకున్న ఏ డాక్టరూ, కుటుంబానికి సంపూర్ణారోగ్యం ప్రసాదించడు.
యాక్టరు కొడుకు యాక్టరే ఎందుకవుతాడు? ఎక్కడానికి? దేనిమీద? అభిమాని భుజాల మీద.
అభిమాని కొడుకు వీరాభిమానిగానే పుడతాడు. విమర్శకుడిగా పుట్టడు. అది నియమం. కొడుకును తెరకెక్కించాలనుకున్న ఏ యాక్టరూ అభిమానిని ఆలోచింప చెయ్యడు. లేకుంటే కేవల పిక్చర్లుఫ్లాపులయితే అభిమానులు ఆత్మహత్యలెందుకు చేసుకుంటారు?
నీటి చుక్కలూ, నిప్పు రవ్వలే!
ప్రేలుడు పదార్థాలెక్కడో వుండవు. మన చుట్టూరా వుంటాయి. ఊరూ, చెట్టూ, చేమా, గడ్డీ, గాదం-ఏదయినా పేలుతుంది. కాకపోతే కాస్త పాలిటిక్సు దట్టించాలంతే. రాజకీయం సోకితే నీరు కూడా భగ్గు మంటుంది. ఒక్కసారి మంటలొచ్చాక, దాన్ని ఆర్పడం ఎవరి వల్లా కాదు. మళ్ళీ వాటి మీద కాస్త పాలిటిక్సు చిమ్మాల్సిందే.
రాజకీయమంటే ఇంతేనా? తగల(బ)డి నట్లు లేదూ! అని చటుక్కున అనకండి. తగలబెట్టినట్లు లేదూ- అనాలి. తగలడటమంటే రాజకీయానికి బలికావటం. అందుకు కోట్లకు కోట్లు ఆమాయకపు జనం సిధ్ధంగా వుంటారు.
మమత,’చిరు’త-గొప్ప రాజకీయ చిత్రాలు
‘నానో’ అన్నాలేదు, ‘అమ్మో’ అన్నాలేదు.
మమత చేతికి బెంగాలు సరకారు వచ్చింది కానీ, గుజరాత్ పోయిన ‘కారు’ మాత్రం రాదు.
‘టాటా’ అన్నా లాభం లేదు. ‘బైబై’ అన్నా లాభం లేదు.
సింగూరు నుంచి టాటా పూర్తిగా బయిటక పోడు.
‘అన్నా’ అన్నా కుదరదు. ‘తండ్రీ’ అన్నా కుదరదు.
రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మధ్యలో ముంచేసిన ములాయం సింగ్ ఉలకరు, పలరు.
సామాజిక న్యాయమా? ‘సామాజిక వర్గ’ న్యాయమా?
.మాట మాటే. మారదు. కానీ అర్థం మారుతుంటుంది.
కంపు కంపే. మారదు. కానీ ఒకప్పుడు కంపంటే ఇంపయిన వాసన. అంటే సుగంధమన్నమాట. కానీ ఇప్పుడు ఆ ఆర్థం నడవదు. ‘ఆహా,ఏమి ఈ మల్లెల కంపు!’ అని ఇప్పుడంటే బాగుండదు.
చీర చీరే. మారదు. కాకుంటే ఒకప్పుడు పురుషులు కూడా కట్టే వారు. కానీ ఇప్పుడు స్త్రీలు మాత్రమే కడతారు(నిత్యానంద భరితులయన కొందరు పురుష బాబాలు కూడా కడతారనుకోండి. అది వేరే విషయం.) . అర్థం వాడే వేళను బట్టే కాదు, వాడే మనుషులను బట్టి కూడా మారిపోతుంది.
ఆడితప్పని లంచగొండులు!
బెంగాల్ కేకు! కాంగ్రెస్ షాకు!!
తెలివి తేటలుండాలే కానీ, భోగాన్ని కూడా త్యాగం ఖాతాలో వేసెయ్యొచ్చు. ప్రేమాట అడే అబ్బాయిలూ, అమ్మాయిలూ ఇలాంటి త్యాగాలు తెగ చేస్తున్నారు లెండి.
‘హనీ, నీకు వేరే సంబంధం చూశారట కదా!’ అంటాడు కుర్రాడు.
‘అవున్రా! రెండు కోట్లు కట్నం ఇచ్చి మరీ కొంటున్నారు పెళ్ళికొడుకుని’ అంటుంది కుర్రది.
ఎక్కడో ప్రాణం చివుక్కుమంది కుర్రాడికి. రెండు కోట్లు రాంగ్రూట్లో పోతున్నాయంటే ఎంత బాధ. ఇంకా వాడు తేరుకునే కుర్రది ఇంకో బాంబు వేసింది.
పాదుకా ‘ప్రచారా’భిషేకం!
చెప్పుల్లో కాళ్ళు పెట్టటమూ, తప్పుల్లో వేళ్ళు పెట్టటమూ చిన్న విషయాలు కావు. అయినా సరే, చిన్న పిల్లలకు ఈ రెండు పనులూ సరదా. చెయ్యకుండా వుండలేరు. నాన్న చెప్పుల్లోనో, నానమ్మ చెప్పుల్లోనో కాళ్ళు పెట్టటానికి ఉబలాటపడతారు. పెద్దచెప్పులూ, బుల్లి పాదాలూ..! ఇదో ఆట. ఈ ఆటే వారసత్వ రాజకీయం. మిగిలిన దేశాల మాట ఎలా వున్నా, మన దేశంలో ఈ ఆటకు డిమాండ్ ఎక్కువ.