Tag: కేసీఆర్

‘అమితా’శలపై తెలుగు నీళ్ళు..?

అణచుకుంటే అణిగేదీ, తీర్చుకుంటే తీరేదీ కోరిక కాదు. ఆ తర్వాత పెరుగుతుంది, చచ్చినట్టే చచ్చి తిరిగి పుడుతుంది. అందుకే కాబోలు- అటు అణచటం, ఇటు తీర్చుకోవటమూ కాకుండా- కోరికను జయించ మన్నాడు బుద్ధుడు. కాంక్షలన్నిటిలోనూ పెద్ద కాంక్ష రాజ్యకాంక్ష. ఇది ఒక పట్టాన తీరదు. రాచరికాలు పోయినా, ప్రజాస్వామ్యం వచ్చేసినా రాజ్యమేలాలనే కాంక్ష పదిలంగా వుంది.…

తొందరపడి ‘చంద్రులు’ ముందే వెలిగారు!

ద్వేషాలూ, అవసరాలూ- ఈ రెండే ఎన్నికల్లో అమ్మకపు సరకులు. ద్వేషం ఇలా పుట్టి అలా చల్లారిపోతుంది. ఒక అవసరం తీరిన వెంటనే ఇంకొకటి పుట్టుకొస్తుంది. అందుకే ద్వేషాన్ని రగులుస్తూ వుండాలి; మైనారిటీ వోటర్ల మీద మెజారిటీ వోటర్లను ఎగదోస్తూ వుండాలి. తీర్చిన అవసరాలను గుర్తు చేస్తూ వుండాలి; ‘అమవాస్య నాడు అట్టు పెట్టాను, పౌర్ణమి నాడు…

ఇది ‘గ్రేటర్‌’ నామ సంవత్సరం!!

‘గ్రేటర్‌’! కొత్త ఏడాది(2016) ఏ మాటతోనే మొదలవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పౌరులందరూ ‘హ్యాపీ న్యూయియర్‌’ అని ఒకరినొకరు అభినందించుకోవచ్చు. అందు వల్ల ఆనంద పొందవచ్చు. కానీ ఈ రాష్ట్రాలలో నేతల్ని ఆనందింప చెయ్యాలంటే మాత్రం ‘హ్యాపీ న్యూయియర్‌’ అని అనకుండా ‘గ్రేటర్‌ న్యూయియర్‌’ అనాలి. అప్పుడు విన్న నేత ముఖం వెలుగుతుంది. తెలుగు సంవత్సరాలకు నెంబర్లతో పాటు, పేర్లు కూడా వుంటాయి. కానీ ఇంగ్లీషు సంవత్సరాలకు అంకెలు మాత్రమే వుంటాయి. కానీ 2016కు మాత్రం ఈ రెండు రాష్ట్రాల వారూ పేరు కూడా పెట్టుకోవచ్చు. అదే ‘గ్రేటర్‌’ నామ సంవత్సరం.

దొందూ దొందే!

అటు చంద్రుడు; ఇటు చంద్రుడు. ఇద్దరూ ఇద్దరే.

పేరులోనే కాదు, తీరులో కూడా ఇద్దరికీ పోలికలు వున్నాయి:

పూర్వ విద్యార్ధులు: చంద్రబాబే కాదు, కేసీఆర్‌ కూడా ఎన్టీఆర్‌ ట్రస్టులో చదువుకున్న వారే. ఎదురు తిరిగిన వారిని, ఎలా ‘కూర్చో’ బెట్టాలో తెలిసిన వారు. కొందరికి పదవులిచ్చి ‘కుర్చీలు’ వేస్తారు; ఎందరికో పదవులు ఇస్తామని ఆశ చూపి ‘గోడ కుర్చీ’లు వేస్తారు. దాంతో తమకి వ్యతిరేకుల్లో ఎవరూ’లేవరు’.

కేసీఆర్‌ ‘భూ’ ప్రదక్షిణం!

వైయస్సార్‌ అంటే ‘నీరు’; కేసీఆర్‌ అంటే ‘భూమి’. అవును. (ఉమ్మడి) రాష్ట్రంలో వైయస్సార్‌ ముఖ్యమంత్రి కాగానే ‘జల యజ్ఞాన్ని’ చేపట్టారు. ఎక్కడికక్కడ సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని తలపెట్టారు. విపక్షాలు దీనిని ‘ధనయజ్ఞం’గా అభివర్ణించే వారు. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినది మొదలు ‘భూమి’ ‘భూమి’ అంటూనే వున్నారు. ఆయన దృష్టి అంతా ‘భూమి’ మీదనే పడింది. తొలుత అన్యాక్రాంతమయిన ‘గురుకుల్‌ ట్రస్టు’ భూముల మీద గురిపెట్టారు. ఆ భూముల నిర్మించిన కట్టడాలను కూలగొట్టటానికి సన్నధ్ధమయ్యారు. తర్వాత వరాలు ఇవ్వటంలో కూడా ‘భూ’భ్రమణం చేశారు. దళితులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమిని ఇస్తానని వాగ్దానం కూడా చేశారు. అసెంబ్లీలోని బడ్జెట్‌ సమావేశాల ముగింపు సన్నివేశంలో కూడా కేసీఆర్‌ ను రక్షించింది మళ్లీ ‘భూమే’

‘రుణ’మో…పణమో!

రైతు పెరిగి పారిశ్రామిక వేత్త కావటం నిన్నటి పరిణామం. కానీ పారిశ్రామిక వేత్త ముదిరి రైతు కావటం రేపటి విపరీతం. అవును. ఇది నిజం. కేంద్రంలో కానీ, రాష్ట్రాలలో కానీ అధికారం లో ఎవరు వున్నా, ఇలాంటి భవిష్యత్తుకే బాటలు వేస్తున్నారు. కానీ చిత్రమేమిటంటే, రైతును ముంచే ప్రతిచర్యనూ రైతు క్షేమం పేరు మీద చేస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, చికిత్స కోసం వచ్చిన రోగికి ఔషధమని చెప్పి, విషాన్నిస్తే ఎంత గొప్పగా వుంటుందో, ఈ చర్యకూడా అంత గొప్పగానే వుంటుంది. నిజం చెప్పాలంటే, ‘ఎల్‌పీజీ’ (లిబరలైజేషన్‌, ప్రయివేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌) ఆర్థిక విధానం దేశంలోకి వచ్చాక, ఏ పార్టీ సర్కారయినా, ఇదే పనిచేసింది.

‘ఈజీ’ నామాలా? ‘క్రేజీ’నామాలా?

రోజూ పెట్టే ‘నామా’లే, రాజీనామాలయ్యాయి. ఎవరు ఎవరికి పెడతారు? అనుమానమేముంది? నేతలు జనానికి పెడతారు.మట్లాడితే రాజీనామా! అంటే మన నేతల్లో పదవీవ్యామోహ స్థాయి అంత దారుణంగా పడిపోయిందా? కుర్చీలన్నా, అధికారాలన్నా లెక్కలేకుండా పోయిందా? ఎమ్మెల్యే, ఎంపీలే కాకుండా, మంత్రులు కూడా రాజీనామాలకు దూకేస్తున్నారు. ఇంత నిస్వార్థపరత్వం వీరికెలా వచ్చేసింది? చూసే వాళ్ళకి నిజంగానే ఆశ్చర్యంగా వుంటుంది.

‘మ్యాచ్‌ ఫిక్సింగు’లు కావు, అన్నీ ‘స్పాట్‌ ఫిక్సింగు’లే!?

క్రికెట్‌లోనే క్రీడాకారులు’మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ల నుంచి ‘స్పాట్‌ ఫిక్సింగ్‌’ల వరకూ వచ్చేశారు. రాజకీయ ఆటగాళ్ళు రాకుండా వుంటారా? వాళ్ళ కన్నా ముందే వచ్చేసి వుంటారు.

మన రాష్ట్రమే తీసుకోండి. ప్రతీ పార్టీ- మరో రెండు పార్టీల మధ్య ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ జరిగిపోయందని ఆరోపిస్తుంది. ఈ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ కాంగ్రెస్‌-వైయస్సార్‌ కాంగ్రెస్‌ల మధ్య జరిగిపోయిందని తెలుగుదేశం ఆడిపోసుకుంటే; కాంగ్రెస్‌- తెలుగుదేశం పార్టీ ల మధ్య జరిగిపోయిందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఎత్తి పొడుస్తుంటుంది.

తుంటరి ‘చేతి’కి ఒంటరి ‘గులాబి’

ఒకప్పుడు ‘సమైకాంధ్ర’ నినాదమిచ్చిన సీమాంధ్ర నేతలెవరూ, తెలంగాణ గడ్డ మీద కేసీఆర్‌కు ఎదురు నిలువ లేదు. ఆ మాట కొస్తే ఉద్యమం ఉధ్ధృతం అయ్యాక కాలు కూడా మోప లేదు. అలాంటిది- ఒకప్పుడు ఇదే కారణం మీద మహబూబా బాద్‌ నుంచి వెనుతిరిగిన వై.యస్‌ జగన్‌, తన తల్లి(విజయమ్మ)నీ, చెల్లి(షర్మిల)నీ తెలంగాణ ఉప ఎన్నికకు ప్రచారానికి పంపిస్తే, కేసీఆర్‌ చోద్యం చూశారు. అంతే కాదు, పరకాలలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ‘నువ్వా-నేనా’ అన్నంతటి పోటీ ఇచ్చి ముచ్చెమట్లు పోయించారు. స్వల్ప ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ పరువు నిలుపు కున్నది కానీ, పట్టు కోల్పోయింది.

రాజకీయమే ‘కుటుంబ’ కథా చిత్రం!

నాభి మీద కొడితే రావణాసురుడు కూలి పోతాడు.

నాభి దాటి వచ్చి తొడల మీద కొడితే దుర్యోధనుడు కూలిపోతాడు.

రెండూ ‘బిలో ది బెల్ట్‌’ పధ్ధతులే.

యుధ్ధనీతి తప్పటమే రాజనీతి!

పోతూ, పోతూ.. రావణాసురుడు పదితలల్లోని పదినోళ్ళతో రాజనీతి చెప్పాడంటారు. ఏమి చెప్పాడో? అప్పుడు ఏమో కానీ, ఇప్పుడయితే, రాజకీయాల్లో దెబ్బతిన్న ఏ

రాజనీతిజ్ఞుడయినా చెప్పే నీతి ఒక్కటే వుంటుంది:

కనకం, కులం, కుటుంబం- ఏ మూడూ కలిస్తేనే రాజకీయం.

‘చేతులు’ కాలాక ‘పువ్వులు’!

వోటర్లకు చేతులు కాలాయి. ఏం పట్టుకోవాలి? తమిళ వోటర్లయితే ‘ఆకులు’ పట్టుకున్నారు.( జయలలిత పార్టీ అన్నా డిఎంకె గుర్తు రెండు ‘విడాకులు’ లెండి.) తెలుగు వోటర్లయితే .. అందునా తెలంగాణ వోటర్లయితే ‘పూలు’ పట్టుకోవచ్చు. అయితే ఏ పూలు పట్టుకోవాలన్నది సమస్య. మొన్నటి దాకా తెలంగాణ మొత్తానికి ఒకే ఒక పువ్వు వుండేది. అదే (టీఆర్‌ఎస్‌) ‘గులాబీ’ ఇప్పుడు ఇంకొక పువ్వొచ్చి పడింది. అదే (బీజేపీ) ‘కమలం’. అయితే తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిన ‘జేయేసీ’ కోదండ రామునికి కొత్త సమస్య వచ్చింది. తెలంగాణ తల్లి దగ్గర నిలబడి దగ్గర వారం రోజులుగా ఒకే కీర్తన ఆలపిస్తున్నారు.