Tag: KCR

తెలుగు నాట ‘చిన్న’ బోయిన జాతీయ పార్టీలు!

తెలుగు రాష్ట్రాలు వేరయినా, ఒక రాష్ట్రంలోని రాజకీయాల ప్రభావం మరొక చోట పడుతూనే వుంది. నాలుగేళ్ళ తర్వాత ఈ ముద్ర మరింత పెరిగింది. ప్రాంతీయ వైరాలు- నేతల్లో సరేసరి- ప్రజల్లో తగ్గాయి. రాష్ట్రం ‘సమైక్యం’గా వున్నప్పటి అపోహలు ‘వేరు పడ్డాక’ తగ్గాయి. కాపురాలు వేరయ్యాక కలయకలు పెరిగాయి. తెలంగాణ కాస్త ముందుగా ఎన్నికలకు వెళ్ళటంతో ఈ…

కుటుంబాలే ముందు.. పార్టీలు తర్వాత…!

కుటుంబం ఒక్కటే, పార్టీలు వేరు. ఇలా అంటే ఒకప్పుడు నమ్మేవారు. కానీ ఇప్పుడు నమ్మడం మానేశారు. ఎందుకంటే ఇప్పుడు కుటుంబాలే పార్టీలయిపోయాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయిందంటున్నారు కానీ, అది రాజకీయాల్లో బతికి వుంది. ప్రాంతీయ పార్టీలొచ్చాక, వాటి సారథ్యాన్ని కుటుంబాలే చేపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశాన్ని ఎన్టీఆర్‌ కుటుంబం, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను కేసీఆర్‌ కుటుంబం, మహరాష్ట్రలో…

నాడు పాటను మెచ్చి.. నేడు పద్యానికి మొక్కి.!

అలకలు కొన్ని; కినుకలు కొన్ని; భజనలు కొన్ని..వెరసి ప్రపంచ తెలుగు మహాసభలయ్యాయి. ఈ ఏడాది(2017) చివర్లో మొత్తానికి హైదరాబాద్‌ మోతెక్కిపోయింది. కోట్ల వ్యయం; లక్షల జనం; వేల కవులూ, రచయితలూ, భాషాభిమానులూ. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి(తెలుగువాడు కావటం యాదృచ్ఛికం.) శ్రీకారం చుడితే, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌(తెలుసుకున్న తెలుగు చరితతో) ‘శుభం’ కార్డు వేశారు. ముగ్గురు ముఖ్యమంత్రులు:…

తొందరపడి ‘చంద్రులు’ ముందే వెలిగారు!

ద్వేషాలూ, అవసరాలూ- ఈ రెండే ఎన్నికల్లో అమ్మకపు సరకులు. ద్వేషం ఇలా పుట్టి అలా చల్లారిపోతుంది. ఒక అవసరం తీరిన వెంటనే ఇంకొకటి పుట్టుకొస్తుంది. అందుకే ద్వేషాన్ని రగులుస్తూ వుండాలి; మైనారిటీ వోటర్ల మీద మెజారిటీ వోటర్లను ఎగదోస్తూ వుండాలి. తీర్చిన అవసరాలను గుర్తు చేస్తూ వుండాలి; ‘అమవాస్య నాడు అట్టు పెట్టాను, పౌర్ణమి నాడు…

ఇది ‘గ్రేటర్‌’ నామ సంవత్సరం!!

‘గ్రేటర్‌’! కొత్త ఏడాది(2016) ఏ మాటతోనే మొదలవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో పౌరులందరూ ‘హ్యాపీ న్యూయియర్‌’ అని ఒకరినొకరు అభినందించుకోవచ్చు. అందు వల్ల ఆనంద పొందవచ్చు. కానీ ఈ రాష్ట్రాలలో నేతల్ని ఆనందింప చెయ్యాలంటే మాత్రం ‘హ్యాపీ న్యూయియర్‌’ అని అనకుండా ‘గ్రేటర్‌ న్యూయియర్‌’ అనాలి. అప్పుడు విన్న నేత ముఖం వెలుగుతుంది. తెలుగు సంవత్సరాలకు నెంబర్లతో పాటు, పేర్లు కూడా వుంటాయి. కానీ ఇంగ్లీషు సంవత్సరాలకు అంకెలు మాత్రమే వుంటాయి. కానీ 2016కు మాత్రం ఈ రెండు రాష్ట్రాల వారూ పేరు కూడా పెట్టుకోవచ్చు. అదే ‘గ్రేటర్‌’ నామ సంవత్సరం.

చీలిక మంచిదే… కోరిక తీర్చింది!

మరక మంచిదే… అన్నట్టుగా, విభజన మంచిదే అన అంటున్నారు. చిత్రం. ఈ మాటను ‘విభజన’ వాదుల కన్నా, ‘సమైక్య వాదులు’ అంటున్నారు. మరీ ముఖ్యంగా రెండు తెలుగురాష్ట్రాలలోని ఆర్టీసీ కార్మికులూ ఇదే మాట అంటున్నారు.
ఆర్టీసీ కార్మికులకు కష్టాలూ కొత్త కాదు, సమ్మెలూ కొత్త కాదు. గతంలో కూడా జీతాల పెంపు కోసం సమ్మెలు చేశారు. ఎప్పుడూ తమ డిమాండ్లు ప్రభుత్వం ముందు వుంచినా, కార్మికులే ఎక్కువగా దిగి రావాల్సి వచ్చేది

దొందూ దొందే!

అటు చంద్రుడు; ఇటు చంద్రుడు. ఇద్దరూ ఇద్దరే.

పేరులోనే కాదు, తీరులో కూడా ఇద్దరికీ పోలికలు వున్నాయి:

పూర్వ విద్యార్ధులు: చంద్రబాబే కాదు, కేసీఆర్‌ కూడా ఎన్టీఆర్‌ ట్రస్టులో చదువుకున్న వారే. ఎదురు తిరిగిన వారిని, ఎలా ‘కూర్చో’ బెట్టాలో తెలిసిన వారు. కొందరికి పదవులిచ్చి ‘కుర్చీలు’ వేస్తారు; ఎందరికో పదవులు ఇస్తామని ఆశ చూపి ‘గోడ కుర్చీ’లు వేస్తారు. దాంతో తమకి వ్యతిరేకుల్లో ఎవరూ’లేవరు’.

కేసీఆర్‌ ‘భూ’ ప్రదక్షిణం!

వైయస్సార్‌ అంటే ‘నీరు’; కేసీఆర్‌ అంటే ‘భూమి’. అవును. (ఉమ్మడి) రాష్ట్రంలో వైయస్సార్‌ ముఖ్యమంత్రి కాగానే ‘జల యజ్ఞాన్ని’ చేపట్టారు. ఎక్కడికక్కడ సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని తలపెట్టారు. విపక్షాలు దీనిని ‘ధనయజ్ఞం’గా అభివర్ణించే వారు. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయినది మొదలు ‘భూమి’ ‘భూమి’ అంటూనే వున్నారు. ఆయన దృష్టి అంతా ‘భూమి’ మీదనే పడింది. తొలుత అన్యాక్రాంతమయిన ‘గురుకుల్‌ ట్రస్టు’ భూముల మీద గురిపెట్టారు. ఆ భూముల నిర్మించిన కట్టడాలను కూలగొట్టటానికి సన్నధ్ధమయ్యారు. తర్వాత వరాలు ఇవ్వటంలో కూడా ‘భూ’భ్రమణం చేశారు. దళితులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమిని ఇస్తానని వాగ్దానం కూడా చేశారు. అసెంబ్లీలోని బడ్జెట్‌ సమావేశాల ముగింపు సన్నివేశంలో కూడా కేసీఆర్‌ ను రక్షించింది మళ్లీ ‘భూమే’

Is KCR’s ‘Operation Aakarsh’ unethical?

Defection sounds unethical to the party that loses its flock. It’s nothing unusual, if the congress in Telangana cries foul for its dwindling strength in the Assembly.

Unfortunately, ethics has ceased to be the language of losers in Indian politics.

లేవకండి! సినిమా ఇంకా వుంది!!

శుభం కార్డు పడ్డాక, కూడా క్లయిమాక్సు కొనసాగే సినిమా చూశారా? అయితే చూడండి. యూపీయే ప్రొడక్షన్స్‌ వారి ‘రాష్ట్ర విభజన’ అనే చిత్రం అలాంటిదే. ఆంధ్రప్రదేశ్‌నుంచి తెలంగాణను వేరు చేసి రాష్ట్రంగా గుర్తించాలంటూ కేంద్ర కేబినెట్‌ చేసిన చేసిన తీర్మానం తర్వాత కూడా సినిమా కొనసాగుతోంది.

ముగిసింది కదా, అని థియేటర్లో తమ కుర్చీలలోంచి ప్రేక్షకులు పలుమార్లు లేవటం, కొనసాగుతుంటే మళ్ళీ కూర్చోవటం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇప్పటి రాష్ట్ర రాజకీయం అలాగే వుంది.

‘దేశ‘మును ప్రేమించుమన్నా.. పొత్తు అన్నది ఉంచుమన్నా.!

మోడీకి నిజంగానే దేశం భక్తి తన్ను కొచ్చింది. ఇది ఒక రకం కాదు, రెండు రకాలు. ఒకటి: ‘హిందూ’ దేశభక్తి.(భారత దేశం అనే మాట కంటే, హిందూదేశమనే మటే ఆయనకు ఎంతో వినసొంపుగా వుంటుంది.) రెండవది: ‘తెలుగుదేశ’భక్తి. ఈ రెంటినీ ఏకకాలంలో ఆయన హైదరాబాద్‌లో ప్రకటించాడు.

చేసేది చెలిమి! తీసేది కత్తి!!

కూలిపోతున్నానని తెలిసి కూడా కులాసాగా వున్నానని చెప్పటం కష్టమే. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇదే స్థితిలో వుంది. కాంగ్రెస్‌ పై వోటర్ల విశ్వాసం సన్నగిల్లిందని, సర్వేల సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికిప్పుడుపార్లమెంటు ఎన్నికలు వస్తే, రాష్ట్రం వరకూ (మొత్తం 42 స్థానాల్లో) కాంగ్రెస్‌ కు వచ్చే సీట్లు ఏడు లేదా ఎనిమిది అని చెబుతున్నారు. 2009 ఎన్నికలలో 33 స్థానాలను గెలుచుకున్న ఈ పార్టీకి ఎంత నిరుత్సాహం కలగాలి?

‘ఇచ్చే’ పార్టీనుంచి, ‘తెచ్చే’ పార్టీకి!!

ఆరోపణలు ఆరోపణలే. ఆకర్షణలు ఆకర్షణలే. ‘గులాబీ’ తీరే అంత. ముళ్ళు ముళ్ళే. మోజులు మోజులే.

ముళ్ళున్నాయని ‘గులాబీ’ చెంతకు వెళ్ళటం మానేస్తామా? కాంగ్రెస్‌ ఎంపీలు వివేక్‌. మందా జగన్నాథంలకు పని చేసి వుండవచ్చు. అందుకే, వెనకా, ముందు చూసి కూడా కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి దూకేశారు. వివేక్‌ సోదరుడు వినోద్‌ కూడా ఇదే బాటలో వున్నారు.

‘మ్యాచ్‌ ఫిక్సింగు’లు కావు, అన్నీ ‘స్పాట్‌ ఫిక్సింగు’లే!?

క్రికెట్‌లోనే క్రీడాకారులు’మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ల నుంచి ‘స్పాట్‌ ఫిక్సింగ్‌’ల వరకూ వచ్చేశారు. రాజకీయ ఆటగాళ్ళు రాకుండా వుంటారా? వాళ్ళ కన్నా ముందే వచ్చేసి వుంటారు.

మన రాష్ట్రమే తీసుకోండి. ప్రతీ పార్టీ- మరో రెండు పార్టీల మధ్య ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ జరిగిపోయందని ఆరోపిస్తుంది. ఈ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ కాంగ్రెస్‌-వైయస్సార్‌ కాంగ్రెస్‌ల మధ్య జరిగిపోయిందని తెలుగుదేశం ఆడిపోసుకుంటే; కాంగ్రెస్‌- తెలుగుదేశం పార్టీ ల మధ్య జరిగిపోయిందని వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఎత్తి పొడుస్తుంటుంది.

ప్రజాస్వామ్యంలో ‘రాచకుటుంబాలు’!

పార్టీ అన్నాక ఓ అధినేత వుంటాడు. ఆ అధినేతకు ఓ కుటుంబం వుంటుంది. ఆ కుటుంబంలో సభ్యులుంటారు. సభ్యులనందరినీ అధినేత ఒకేలా చూడొచ్చు. కానీ ఏదో ఒక సభ్యుడికి తనను తక్కువ చూస్తున్నారన్న భావన కలగ వచ్చు. ఆ భావన పెరిగి పెద్దదయితే కలహానికి దారి తీయ వచ్చు. ఇంకా పెద్దదయితే ఆ సభ్యుడు ‘అసభ్యుడ’ వుతాడు. వేరే పార్టీ కూడా పెడతాడు.

అయినా పార్టీ మొత్తం ఒక కుటుంబం చేతిలో వుండటం ఏమిటి? ఇది రాచరికమా?

కిరణ్ ను గిల్లితే, బాబు గొల్లుమన్నారు

పెళ్ళీ, ప్రజాస్వామ్యమూ రెండూ ఒక్కటే. రెండూ రెండు తంతులు. తంతులో తంతులాగా, పెళ్ళితంతులో కాశీ తంతు ఒకటి వుంటుంది. శుభమా- అని పెళ్ళి జరుగుతుంటే, పెళ్ళి కొడుకు తాటాకు గొడుగు ఒకటి పట్టుకుని , చెక్క చెప్పులు వేసుకుని కాశీకి పోతానంటాడు. అప్పుడు అతని బావమరది (అనగా పెళ్ళికూతురు తమ్ముడు) వచ్చి పెళ్ళికొడుకు గెడ్డం కింద బెల్లం ముక్క పెట్టి, ‘బావగారూ, కాశీకి వెళ్ళకండి, మా అక్కను ఏలుకోండి. ప్లీజ్‌’ అంటాడు. అప్పుడు ఆ పెళ్ళికొడుకు కాస్త బెట్టు చేసి, వెనక్కి వచ్చేసి, పెళ్ళికూతురు చెయ్యి పట్టేసుకుంటాడు. ఈ

‘గాంధీ’ని చూపితేనే, వోటు!!

అభ్యర్థి జేబులోని అయిదువందల రూపాయి నోటు తీసి, వోటరు చేతిలో పెట్టి- ‘చూస్కో గాంధీ వున్నాడో? లేదో?’ అంటాడు. తళ తళ లాడే నోటును కళ్ళ దగ్గర పెట్టుకుని, బోసినవ్వుల గాంధీని చూసుకుని- ‘ఇప్పుడు నమ్ముతాను నువ్వ గాంధేయ వాదివని. నా వోటు నీకేలే ఫో!’ అంటాడు.

అవును. మరి. గాంధీ ముఖం చూసి వోటేస్తున్నారు కానీ, అభ్యర్థుల్ని చూసి వేస్తున్నారా?

ఓవర్‌ టూ తెలంగాణ!

వేదికలు రెండు; ప్రదర్శనలు రెండు

కానీ దర్శకులూ మారరు. ప్రేక్షకులూ మారరు.

ఒక వేదిక సీమాంధ్ర; మరొకటి తెలంగాణ.

కొంత సేపు ఈ బొమ్మా, ఇంకొంత సేపు ఆ బొమ్మా…!!

ఈ మూడేళ్ళూ ఇదే వరస.

ఈ పూటకి సీమాంధ్ర బొమ్మే నడుస్తోంది. కానీ హఠాత్తుగా తెలంగాణ బొమ్మ తెర మీదకొచ్చింది.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌!-: – మనీ మిక్సింగ్‌!!

వియ్యమన్నాక– వావీ, వరసల ప్రస్తావన వస్తుంది. వరసయిన వారితోనే ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ వుండాలి. వరసలు తప్పితేనే అల్లరవుతారు.

రాజకీయ వియ్యాల్లోనూ ఇదే నియమం. వరస తప్పకూడదు. ఉదాహరణకు ‘కాషాయానికీ’, ‘ఎరుపున’కూ వియ్యం కుదరదు. అనగా ‘కమలాని’కీ, ‘కొడవలి’కీ మధ్య ‘ఎఫైర్‌’ నడవదన్నమాట. (కమలమొచ్చి, కొడవలి మీద పడ్డా, కొడవలి వచ్చి కమలం మీద పడ్డా- తెగిపడేది కమలమే!)

రాజకీయమే ‘కుటుంబ’ కథా చిత్రం!

నాభి మీద కొడితే రావణాసురుడు కూలి పోతాడు.

నాభి దాటి వచ్చి తొడల మీద కొడితే దుర్యోధనుడు కూలిపోతాడు.

రెండూ ‘బిలో ది బెల్ట్‌’ పధ్ధతులే.

యుధ్ధనీతి తప్పటమే రాజనీతి!

పోతూ, పోతూ.. రావణాసురుడు పదితలల్లోని పదినోళ్ళతో రాజనీతి చెప్పాడంటారు. ఏమి చెప్పాడో? అప్పుడు ఏమో కానీ, ఇప్పుడయితే, రాజకీయాల్లో దెబ్బతిన్న ఏ

రాజనీతిజ్ఞుడయినా చెప్పే నీతి ఒక్కటే వుంటుంది:

కనకం, కులం, కుటుంబం- ఏ మూడూ కలిస్తేనే రాజకీయం.