Category: Essays

బాబూ! ‘సైకిలు’ దిగుతారా?

అడుగులు ముందుకీ.., నడక వెనక్కీ…!

ఆశ్చర్యమే. బాధాకరమే.

కానీ, చేయగలిగిందేమీ లేదు.

తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవటానికి చేపట్టిన చంద్రబాబు పాదయాత్ర ఇలాగే వుంది. ఇది, అక్కసుతోనో, ఉక్రోశంతోనో ప్రత్యర్థులు చేస్తున్న వ్యాఖ్యకాదు.అలాగని, శత్రువర్గ మాధ్యమాలు తన మీద అకారణంగా కక్కుతున్న విషమూ కాదు.

పాదయాత్రల ఫలితాలు అలా వున్నాయి.

ఓవర్‌ టూ తెలంగాణ!

వేదికలు రెండు; ప్రదర్శనలు రెండు

కానీ దర్శకులూ మారరు. ప్రేక్షకులూ మారరు.

ఒక వేదిక సీమాంధ్ర; మరొకటి తెలంగాణ.

కొంత సేపు ఈ బొమ్మా, ఇంకొంత సేపు ఆ బొమ్మా…!!

ఈ మూడేళ్ళూ ఇదే వరస.

ఈ పూటకి సీమాంధ్ర బొమ్మే నడుస్తోంది. కానీ హఠాత్తుగా తెలంగాణ బొమ్మ తెర మీదకొచ్చింది.

‘మీ నాన్న మాజీ యా?’

మీ నాన్న మొన్న నాదెండ్ల మనోహర్‌ స్పీకరయ్యారు.

నిన్న కోట్ల సూర్యప్రకాశ రెడ్డి కేంద్రమంత్రయ్యారు

నేడు మర్రి శశిధర రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ముగ్గురి తండ్రులూ ఒకప్పడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులే.ఈ మాజీ ముఖ్యమంత్రులు కేవలం కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రులయి వుండాలా?

ఈ ‘రిజర్వేషన్‌’ వారి కొడుకులకేనా? కూతుళ్ళకు కూడా వర్తిస్తుందా?

ఈ రెండూ ప్రశ్నలూ వేయగానే గుర్తుకు వచ్చే పేరు- దగ్గుబాటి పురంధరేశ్వరి.

కొయ్య గుర్రానికి కొత్త రౌతులు!

మొదలయ్యింది.

.

ఆట మొదలయ్యింది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఆట మొదలయ్యింది.

ఈ ఆట పేరు ఇల్లు చక్కబెట్టుకోవటం.

అవును. నేడు కాంగ్రెస్‌కు దేశమంతా ఒక యెత్తు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఒక్కటీ ఒక యెత్తు. లేకుంటే, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అరడజను రాష్ట్రాలను సైతం పెద్దగా పట్టించుకోకుండా, ఈ రాష్ట్రం మీద, ఇంతగా దృష్టి సారించదు.

ఇందుకు మొదటి సంకేతం: కేంద్రమంత్రి వర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు పెరిగిన ప్రాతినిథ్యం.

వ్యాపారం వద్దురా! రాజకీయం ముద్దురా!!

వెనకటి ఎవరో అన్నారు- దేవుడు లేక పోతే ఎలా-అని? ఉంటే సరే. లేక పోతే ఏం చెయ్యాలి? వెంటనే ఒక దేవుణ్ణి సృష్టించుకోవాలి!!

మనదేశంలో దేవుళ్ళకు లోటు లేదు. స్వరాజ్యం వచ్చాక రాజుకు లోటు వచ్చింది. వెంటనే ఎవర్నో ఒకర్ని రాజుగా చేసుకుని, అతని కుటుంబాన్ని రాజకుటుంబంగా మార్చుకోవాలి.

అలా సమయానికి దొరికిన వ్యక్తే నెహ్రూ. ఆయననుంచి మొదలయి, ఇప్పటి వరకూ నెహ్రూ-గాంధీ కుటుంబం ‘అప్రకటిత రాజకుటుంబం’ అయిపోయింది

శేఖర్ కమ్ముల ఫార్ములా: ఏకలయినా ఒకేలా! ఏకథయినా అదేలా!!

దర్శకుడన్నాక తిరగాలి. తిరగక పోతే కథలు రావు. ఏమాటకామాటే చెప్పుకోవాలి. పాపం. కొత్తతరం దర్శకులు తిరుగుతున్నారు. ఈ తిరుగుడు రెండు రకాలుగా వుంటుంది. ఒకటి: ఇంగ్లీషు సినిమాల చుట్టూ తిరగటం . రెండు: తమ సినిమాల చుట్టూ తాము తిరగటం.

వీరిలో ఏ ఒక్కరూ జీవితం చుట్టూ తిరగరు. అదే విషాదం.

మొదటి రకం కన్నా, రెండవ రకం దర్శకులే మెరుగు. కాపీ కొడితే, తమను తామే కాపీ కొట్టుకుంటారు. వీరి మీద సానుభూతి వుంటుంది కానీ, చులకన భావం వుండదు. ఆ కోవకు చెందిన వారే శేఖర్‌ కమ్ముల.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ రాజీ ఫార్ములా: లాభసాటి ఓటమి!

తెలంగాణ!

తేల్చేస్తే తేలిపోతుంది

నాన్చేస్తే నానిపోతుంది.

తేలిపోతే, కాంగ్రెస్‌ తేలుతుందా? మునుగుతుందా? ఇప్పుడున్న స్థితిలో తేల్చకపోయినా మునుగుతుంది.

మునిగిపోవటం తప్పదన్నప్పుడు కూడా, కాంగ్రెస్‌ తేలే అవకాశం కోసం ప్రయత్నిస్తోంది. ఇది కొత్త పరిణామం. తేల్చటం వల్ల కాకుండా, నాన్చటం వల్లే ఈ ప్రయత్నం ఫలించగలదని ఆ పార్టీ నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది.

కలసి రాకే, ‘కుల’కలం!

అడుగులు తడబడినప్పుడెల్లా బడుగులు గుర్తుకొస్తారు.

తెలుగు దేశం , కాంగ్రెస్‌ పార్టీలకు నడక సాగటం లేదు. కాంగ్రెస్‌ పరిస్థితి మరీ దారుణం. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనూ అడుగు తీసి, అడుగు వేయలేక పోతోంది.

టార్చిలైట్‌ వేసి వెతికినా, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వం- అన్నది కానరావటం లేదు.అక్కడ ప్రధాని మన్‌ మోహన్‌ సింగ్‌ ‘ఉన్నారో, లేదో తెలియదు.’ ఇక్కడ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి -‘ఉంటారో, ఊడతారో’ తెలియదు.

ప్రధాని తన ముఖానికే బొగ్గు ‘మసి’ రాసుకుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి తన ‘కేబినెట్‌’ ముఖానికి ‘వాన్‌పిక్‌’ తారు పులిమేశారు.

సోనియా కోపం- రాహుల్‌ కోసం!

సోనియా గాంధీ ‘బొగ్గు’ మన్నారు. పార్లమెంటు ‘మసి’బారింది. సమావేశాల్లో మరో రోజు ‘బ్లాక్‌’ డేగా మారింది. ఏమిటో అంతా ‘నలుపే’. బొగ్గు గనుల కేటాయిపుల అవకతకలపై ‘కాగ్‌’ నివేదిక చూశాక కాగి పోవాల్సింది ప్రతి పక్షం. కానీ, అదేమిటో పాలక పక్షం ఊగిపోతోంది. బీజేపీకి ‘బ్లాక్‌ మెయిలింగే బువ్వ’ అన్నారు సోనియా. బీజేపీ నేతలకు – ‘బ్లాక్‌’ మెయిలింగ్‌ లో ‘బ్లాక్‌’ ఒక్కటే అర్థమయింది. నలుపుకు నలుపే సమాధానం అనుకున్నారో ఏమో సమాధానం కూడా ‘నలుపు’తోనే ఇచ్చారు.

‘ధర్మాన’ పీఠం దద్దరిల్లింది!

‘కిరణ’ం ప్రకాశించటం లేదు. రాష్ట్రంలో ఇది వార్త కాదు.

ఎందుకు ప్రకాశించటం లేదు? ఇదీ ప్రశ్న.

ఈ ప్రశ్నకు పలువురూ ఇచ్చే జవాబు వేరు. పార్టీ అధిష్ఠానం వెతుక్కుంటున్న సమాధానం వేరు.

కిరణంలో కాంతి తక్కువయిందని అందరూ అంటారు.

కానీ, పార్టీ హైకమాండ్‌ అలా అనదు. చుట్టూ చీకటి తక్కువయిందీ- అని అంటుంది.

అందుకే కాబోలు- ‘కిరణ్‌’ చుట్టూ చీకట్లు పెంచుతోంది.

కిరణ్‌ మంత్రి వర్గంలో ‘కళంకితుల’ శాతం పెరుగుతున్న కొద్దీ, ఆయన ఉనికి పెరుగుతుందన్నది హైకమాండ్‌ భావన కాబోలు. ఇంతవరకూ మిణుకు మిణుకు మని దిగులుగా మెరుస్తున్న ‘కిరణం’ ఇప్పటికయినా ప్రకాశవంతంగా కనిపించక పోతుందా-అని ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలకు చిగురంత ఆశ కాబోలు.

జగన్‌ జర్నీలో ‘మజిలీ’స్‌!

జగన్‌ ప్రణబ్‌కు వోటేశారు.

కాంగ్రెస్‌తో ‘మ్యాచ్‌ ఫిక్సింగా’? వెంటనే అనుమానం.

ఇంకేముంది? యుపీయే అభ్యర్థి, కాంగ్రెస్‌లో కీలకమయిన వ్యక్తి ప్రణబ్‌ ముఖర్జీకి వోటెయ్యటమంటే కాంగ్రెస్‌లో కలవటం కాదూ?

నిజంగానే ఇది ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ల సీజన్‌. సంకీర్ణ రాజకీయ యుగంలో- ఇది సహజం.

కానీ, జగన్‌ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ అంటూ వెంటనే చేసుకోవలసి వస్తే, కాంగ్రెస్‌ తో చేసుకోరు. ఒక వేళ అలా చేసుకుని కలిసిపోతే, అది తన పార్టీ(వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ)కి మంచిది కాదు, కాంగ్రెస్‌ పార్టీకీ మంచిది కాదు. నిన్న కత్తులు దూసుకున్న వారు నేడు కౌగలించుకుంటే, అంతే వేగంగా రెండు పార్టీల్లోని కార్యకర్తలూ చెయ్యలేరు.

జూనియర్‌ ఆట అదుర్స్‌!

కోపం జూనియర్‌ ఎన్టీఆర్‌ మీద.

కేకలు కొడాలి నాని మీద.

తెలుగుదేశం పార్టీ నాయకుల తాజా వైఖరి ఇది. అధినేత చంద్రబాబు నాయుడు ఆంతర్యం కూడా ఇదే.

జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే చంద్రబాబుకు ప్రియమా? భయమా?

తొలుత ప్రియంగా అనే అనిపించింది. కారణం ఒక్కటే. జూనియర్‌ గ్లామరున్న ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుడు.

ఆవేశంలో ఆమె సగం!

సమస్య అంటేనే స్త్రీ. స్త్రీ అంటేనే సమస్య. ఇది ఇంటి భాగోతం.

సమరం అంటేనే స్త్రీ. స్త్రీ అంటేనే సమరం. ఇది వీధి భారతం.

కేవలం రెండే రెండు దశాబ్దాలలో దేశ పోరాట చిత్రపటాన్ని మార్చేశారు స్త్రీలు. ఇలా అనగానే కేవలం స్త్రీలుగా తమ సమస్యలపైనే తాము పోరాటం చేశారనే నిర్థారణకు రావచ్చు. పురుషులు సైతం ఎదుర్కొనే ఇబ్బందుల మీద కూడా పిడికిళ్లు బిగించారు.

కాకుంటే, తమ పోరాటాలను వెను వెంటనే రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని మాత్రం వీరు భావించలేదు. అదే జరిగితే, పాలన మొత్తాన్ని తలక్రిందులు చేయగలుగుతారు.

రెండు కుటుంబాల పోరు

అధినేత వేరు, నేత వేరు.

ఇద్దరికీ మధ్య చెయ్యి ఊపటానికీ, చేతులు జోడించటానికీ వున్నంత తేడా. అది రోడ్‌ షో కావచ్చు, బహిరంగ సభ కావచ్చు. ఇద్దరూ ఆ తేడాను పాటించాలి.

ఉదాహరణకి సోనియా గాంధీ, కిరణ్‌కుమార్‌ రెడ్డీ ఒకే వేదిక మీదకొచ్చారనుకోండి. వారు మాట్లాడే భాషలే కాదు, దేహ భాషలు కూడా వేరు వేరుగా వుంటాయి. జనం వైపు తిరిగి సోనియా చెయ్యి ఊపితే, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏడుకొండలవాడి ముందు చేతులు జోడించినట్టు అదే జనానికి నమస్కరించాలి.

సై- ఆట మళ్ళీ మొదలు

ఆట మళ్ళీ మొదలు.

మామూలు ఆట కాదు. రక్తసిక్తమైన క్రీడ.

ఒకప్పుడు రెండు టీమ్‌లు సరిపోయాయి. ఇప్పుడు మూడు టీమ్‌లు కావాలి. ఆట కోసం ప్రాణాలు అర్పించాలి. రోడ్ల మీద పరుగులు తీస్తూ నిలువునా దగ్థమవ్వాలి. నడిచే బస్సులు భస్మీపటలమయిపోవాలి.

కేకలు. ఆక్రందనలు. నినాదాలు. ఆమరణ దీక్షలు.

ఈ మృగయా వినోదానికి ముహూర్తాలు పెడుతున్నారు ఢిల్లీలో పెద్దలు.

‘హంగే’ బెంగ!

బెంగ.

2012 లాగే 2014 కూడా ఉంటుందన్న బెంగ.

ఉప ఎన్నికల ఫలితాలే, సార్వత్రిక ఎన్నికల్లోనూ వస్తాయన్న బెంగ.

రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీకి బదులు మూడు ప్రాంతీయ పార్టీలు(తెలుగు దేశంతో పాటు, టీఆర్‌ఎస్‌, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు) వచ్చేశాయన్న బెంగ.

2014 లో సీమాంధ్రలో త్రిముఖ పోటీ, తెలంగాణాలో చతుర్ముఖ పోటీ వుంటుందన్న బెంగ( బీజేపీ చతికిలపడింది. లేకుంటే పంచముఖ పోటీ వుండేది.)

అన్నింటినీ మించి రాష్ట్రంలో ‘త్రిశంకు సభ’ (హంగ్‌ అసెంబ్లీ) వస్తుందన్న బెంగ.

వోటరే విజేత

చివరి నవ్వు వోటరే నవ్వాడు.

గెలిచినవారికి పూర్తి ఆనందాన్ని కానీ, ఓడిన వారికి పూర్తి విషాదాన్ని కానీ మిగల్చలేదు.

ఈ ఉపసమరం అద్దంలాగా ఎవరి నిజరూపాన్ని వారికి చూపించింది. పేరుకు 18 అసెంబ్లీ స్థానాలకూ, ఒక పార్లమెంటు స్థానానికీ జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు. కానీ ఫలితాలు మాత్రం రాష్ట్ర రాజకీయ నాడిని పట్టి ఇచ్చాయి.

జనమే జయమా?

జనమంటే ఏ జనం? వచ్చిన జనమా? తెచ్చిన జనమా? ఇది కూడా శేష ప్రశ్నే.

జనం తమంత తాము రావటానికి- గ్లామరో, అభిమానమో, సానుభూతో వుండాలి. ఒక్కొక్క సారి

ఇవేమీ లేకుండా కూడా ‘విచిత్రమైన ఆసక్తి’తో కూడా జనం వస్తుంటారు. ఎన్టీఆర్‌కు ‘వెన్నుపోటు'( కొందరు తిరుగుబాటు అంటారు లెండి) పొడిచి ముఖ్యమంత్రి అయి, తర్వాత పదవీచ్యుతుడయిన నాదెండ్ల భాస్కరరావు కొత్త పార్టీ (ప్రజాస్వామ్య తెలుగుదేశం) పెట్టి ‘రోడ్‌షో’లు నిర్వహిస్తే, ఆయనను చూడటానికి వచ్చారు. ఎన్టీఆర్‌ మరణానంతరం ఆయన భార్య లక్ష్మీపార్వతి ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు కూడా జనం ఆమెను చూడటానికి వచ్చారు. కానీ వీరిద్దరికీ జనం ఘోరపరాజయాన్ని చవిచూపించారు.

కాంగ్రెస్‌ తదుపరి పాచిక: మహిళా ముఖ్యమంత్రి?

కేవలం ముగ్గురు మహిళల్ని ఎదుర్కోవటానికి కాంగ్రెస్‌ కు ఇతర మహిళా నేతలు అవసరమవుతారు.

ఇప్పటికకే రేణుకా చౌదరి విజయమ్మ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

కానీ, ఆమెకు రాష్ట్రవ్యాపితంగా అంత ప్రజాదరణ వుండక పోవచ్చు.

ఈ ముగ్గురు మహిళల ప్రభంజనం ఇంకా పెరిగితే, ముఖ్యమంత్రి స్థానంలో కూడా మహిళానేతను కూర్చోబెట్టే ఆలోచన కాంగ్రెస్‌ పార్టీ చెయ్యవచ్చు.

తామే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకోవటం కోసమయినా ఈ పని చెయ్యాల్సి వస్తుంది.

మళ్ళీ వచ్చిన ‘మహిళావోటు బ్యాంకు’

నోట్లకే కాదు, వోట్లకూ బ్యాంకులుంటాయి.

కులానికో బ్యాంకు, వర్గానికో బ్యాంకు, మతానికో, ప్రాంతానికో బ్యాంకు -ఇలా వుంటాయి. అన్ని పార్టీలకూ, వాటి అగ్రనేతలకూ అన్ని బ్యాంకుల్లోనూ డిపాజిట్లుండవు.

ఆంధ్రప్రదేశ్‌నే తీసుకోండి. ఒకప్పుడు తెలుగుదేశానికి కమ్మ కులం వోట్లతో, బీసీల వోట్లు వుండేవి. కాంగ్రెస్‌కు రెడ్డి, కాపు, కులం వోట్లతో పాటు షెడ్యూల్డు కులాల, తెగల వోట్లు వుండేవి.

ఇప్పుడు మారిపోతున్నాయనుకోండి. కానీ, ఎప్పుడో కానీ, జెండర్‌ని బట్టి వోటు బ్యాంకు ఏర్పడదు.