Category: Poetry (కవితలు)

నాన్న సైకిలు

ఒకటి పెంగ్విన్‌ పిల్లలా నాన్న సైకిల్‌ మీద నేను చక్రాల కింద చిన్నబుచ్చుకున్న సముద్రాలు కన్ననేరానికి కాళ్ళాడిస్తున్నారాయన నడుపుతున్నానన్న భ్రమలో రెక్కలాడిస్తూనేను ”ఎక్కడికిరా కన్నా?” నా శిరస్సునడిగింది నాన్న గెడ్డం ”ఊరవతలకి!” దిక్సూచిలా నా చూపుడువేలు ఛెళ్ళుమన్నది సముద్రం నాన్న చెక్కిళ్ళన్నీ నీళ్ళే మలుపు తిరిగామో లేదో నా బుగ్గలమీదా అవే నీళ్ళు ”నాన్నా! ఉప్పగా…

మృతి-స్మృతి

మనుషులంతే. కలసినప్పడూ, విడిపోయినప్పుడూ, కలసివిడిపోయినప్పుడూ, విడిపోయి కలసినప్పుడూ.. కళ్ళు చెమ్మ చేసుకుంటారు. ఘనమైన మనుషులు, గంభీరమైన మనుషులు, కఠినమైన మనుషులూ ఇలా కరుగుతుంటారు. అవును. కరిగినప్పడే మనుషులు. అంతకు ముందు.. ఏమైనా కావచ్చు: కొయ్యలు కావచ్చు. రాళ్ళు కావచ్చు. గడ్డకట్టిన నదిని చూపి నది అంటే నమ్ముతామా..? మనిషీ అంతే…! కరిగిపోతేనే ఉనికి.

ఎవెల్యూషన్

ఒక పండగ. ఒక పార్టీ. ఒక ఉత్సవం. అన్నీఘటనలే. ఆ పూటలో ముగిసేవే. అప్పటికప్పడు తెలివి వచ్చెయ్యటమూ, ఓవర్ నైట్ ప్రేమ పుట్టెయ్యటమూ, క్షణంలో జీవితం మీద విరక్తి కలిగెయ్యటమూ జరగవు. కడకు ప్రమోషన్లూ, డిసిమిసల్స్ కూడా అంతే. అందుకు సంబంధించిన ప్రోత్సాహమూ, కుట్రా ఎప్పటినుంచో వుండి వుంటాయి. అయినా అన్నీ అప్పటికప్పడు ఇన్ స్టెంట్ గా జరిగాయంటే అదో థ్రిల్. కాళిదాసు రాయగా రాయగా కవి అయ్యాడంటే చికాగ్గా వుంటుంది. సరస్వతి వచ్చి ఆయన నాలుక మీద ఒక్క క్షణంలో రాసి పోయిందంటే.. మహదానందంగా వుంటుంది.. ఘటనలమీద వున్న మోజు, ఎందుకనో పరిణామాల మీద వుండదు.

వైర్ లెస్..!

చిన్న చిటికెన వేలు. ఎవరిదయినా కావచ్చు. కట్టుకట్టి వుంటుంది. గాయం ఎక్కడో వుంటుంది. కట్టు లోపలి, గాజు గుడ్డ లోపలి, దూది లోపలి, టింక్చర్‌ మరకల లోపల ఎక్కడో…! కనిపించనే కనిపించదు. కానీ తెగి వుంటుందన్న ఊహ; రెండు మూడు బొట్లు నెత్తురు కారి వుంటుందన్న ఎరుక! ఈ పిల్లెవరో ఏడ్చే వుంటుంది.

3జీ ఫేస్‌!

నిత్యనూతనమంటే ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. దేహం మీద పాత చొక్కా తీసివేసి, కొత్త చొక్కా వేసుకోవటమే

నూతనత్వమని ఒకప్పుడు భావించే వాణ్ణి. కాని ఇప్పటి తెలివి వేరు. చొక్కాలోపలి పాత దేహాన్ని తీసివేసి, కొత్త దేహాన్ని

తొడుక్కోవటమే. మొన్న పొట్ట వున్న దేహం; నిన్న ఆరు మడతల దేహం; నేడు ఎనిమిది మడతల దేహం. నన్ను నేను

ఎప్పటికప్పుడు కొత్తగా (సిక్స్ లేదా ెయిట్) ‘ప్యాక్’ చేసుకోవాలి. ఇదే అప్ డేషన్.

Floral Era

I express my inability if you ask me to translate rainbow into one color; to prepare all dishes in one taste; and to sing all lyrics in one tune. Identity lies in plurality and multiplicity. You can find me in group too. This is the soul of my poem.

తిరిగొచ్చిన తూటా

పిలుస్తూనే వుంటాం. మనిషి తర్వాత మనిషిని ఈ భూమ్మీదకు ఆహ్వానిస్తూనే వుంటాం. నన్ను నా అమ్మా నాన్నా

ఆహ్వానించినట్లు, నేను నా బిడ్డల్ని ఆహ్వానించాను. ఆహ్వానితుడికి ఎర్రతివాచీ పరచనవసరం లేదు; పట్టు బట్టలు పెట్టనవసరం

లేదు; పంచ భక్ష్య పరమాన్నాలు వడ్డించనవసరంలేదు. ఆకలినో, నేరాన్నో బహూకరించకుండా వుంటే, అదే పది వేలు. వాడి

చేతికి బలపం ఇవ్వక పోయినా ఫర్వాలేదు, నెత్తిన ఇటుకల దొంతర పేర్చకుండా వుంటే చాలు. అన్ని మాటలు ఎందుకు కానీ,

వాడిపై జాలి చూపించకపోయినా ఫర్వాలేదు, భుజానికి జోలె తగిలించకుండా వుంటే చాలు.

ఎవరెస్టు పై ఎవరెస్టు

భూగర్భాన్నీ, గగనతలాన్నీ, కడలి కడుపునీ తడిమి చూడగల మానవుడికి, ఇంకా తనకూ తన తోటిమానవుడికీ మధ్య దూరాన్నిెెఎలా లెక్కించాలో తెలియటం లేదు. రోదసి లో గ్రహానికీ గ్రహానికీ వున్నంత దూరమా? మనిషే సాటి మనిషిని చేరాలంటే ఇంకా ఎన్ని కాంతి సంవత్సరాలు ప్రయాణించాలో? తెల్లవాడు నల్లవాడికి చేరువ కావటానికి యుగాలు పట్టింది. ఇంకా ఈ పుణ్యభారతంలో ఊరు, వెలివాడను చేరనే లేదు. మెదానం అరణ్యాన్ని తాకనేలేదు. అయినా వాడబిడ్డ, అడవి పుత్రికా హిమశిఖరాన్ని తాక గలిగారు

రాలిన తూలిక

కొంచెం దిగులు. కాస్త కంటి తడి. పిసరంత ఆనందం. పెదవుల మీదకు వచ్చిపోయిన చిరునవ్వు. ఇవి చాలు, గుంపు నుంచి పారిపోవటానికి. మొబైల్‌ మోగని, టీవీ కనబడని, డియోడరెంట్‌ వాసన రాని, కృత్రిమ కర స్పర్శలేని, పిజ్జాలతో రుచిచెడని చోటకు నా అంతట నేను వెళ్ళిపోతాను. అజ్ఞాతానికి అరణ్యమే అవసరంలేదు. వాకిలి చాలు, కారిడార్‌ చాలు, బాల్కనీ చాలు. వీటన్నిటి కంటే బాత్‌ రూమ్‌ మేలు. ఇష్టమైన తలపులతో నిలువెల్లా తడిసిపోతున్నప్పుడు ఎవరూ ఉండకూడదు. నా కలల హైవేలో నేను వెళ్తున్నప్పుడు, ఎదురుగా ఒక్క వాహనమూ కనపడకూడదు. నా ఇష్టం వచ్చినప్పుడు తిరిగి వస్తాను. ప్లీజ్‌ తలుపులు దబదబా బాదకండి. వెనక నుంచి హారన్ల రొద చేయకండి.

వెన్నెల ముద్ద

ఇలావచ్చి అలా పోయేవి ఎక్కువ మురిపిస్తాయి. మెరుపూ, చినుకూ, కెరటం, మోహం- అన్నీ అంతే. శాశ్వతం- అనుకునేవి ఏవీ అంతటి ఆనందాన్ని ఇవ్వలేవు. జీవితం కూడా అంతే కదా. తుర్రున వచ్చి తుర్రున పోతుంది. అందుకే అంత ఆశపెడుతుంది. ప్రేమ,ప్రేమ అని ఊరేగుతాం, కానీ, మొత్తం ప్రేమాయణానికి గుర్తులుగా మిగిలేవి కొన్ని క్షణాలే. సాయింత్రంపూట కాలేజి బస్సు ఎక్కేముందు, కలిసి తిన్న పానీ పూరీలూ, ఎవరి కంటా పడకూడదని పక్క పక్క సీట్లలో కూర్చుని డొక్కు థియేటర్లో చూసిన పౌరాణిక చిత్రాలూ- ఇవే కదా ఎప్పటికీ మురిపించే విషయాలు!!

‘ఆలి‘ ఖైదాలు!

సూర్యరశ్మి సోకకుండా అత్యంత సుకుమారంగా అంత:పురాలలో వుండే స్త్రీలను అసూర్యంపశ్యలని అని అనేవారు. మహిళలకు భద్రత చాలు, స్వేఛ్చ ఎందుకనే రోజులవి. కానీ పరదాలను దాటుకుని రావటానికి ఆరాటపడుతూనే వున్నారు. వారు బయిటకు వచ్చి అన్ని రంగాలలోనూ తమ ఉన్నతిని చాటుకుంటున్నా, ఈ సూర్యుడనేవాడు ఇంకా వెంటాడుతూనే వున్నవాడు. దాంతో అతణ్ణి మాత్రమే తప్పించుకోవటానికి వారు ముసుగులు ధరించి ‘ఉగ్ర‘వాదులు గా మారణం తప్పటం లేదు. పురుషాధిపత్యం మీద కూడా ఏదో ఒక నాడు వారు నిజంగానే ఈ ‘ఉగ్ర’ రూపం దాల్చక తప్పదేమో.

ఒక గ్రాము ప్రేమ

ఏమిటో. ఇలా అనుకోవటం పాపం, అలా జరిగిపోతుంది. సరిగ్గా చిట్టి చేపను చూసి వల

వేస్తుంటాడతడు. పిచ్చిచేప పిల్ల పారిపోతే బాగుండునూ అనుకుంటాను. అది అనుకున్నట్టే

తుర్రుమంటుంది. అదేదో చానెల్లో లేడిపిల్లని పులి వేటాడుతుంటుంది. దగ్గరవరకూ వచ్చేస్తుంది. పులి

ఆగిపోతే బాగుండుననుకుంటానా, సరిగ్గా అదే సమయానికి దాని కాలికి రాయి తగిలి బోర్లా

పడుతుంది. లేడి పిల్ల తప్పుకుంటుంది. ఇలా ఎలా జరిగిపోతోంది? ఏదయినా అతీత శక్తా? అవును.

దాని పేరే ప్రేమ.

మానవేతరులు

నిజమే. తీయాలనే వుంది. ఉరి తీయాలనే వుంది. దేహాలను దురాక్రమంచే కిరాతకాన్ని ఉరితీయాలనే వుంది. అమ్మదగ్గర తాగిన పాలు అమ్మాయిదగ్గర కొచ్చేసరికి విషం గా మారిపోతున్నాయి. ఇందుకు కారణమైన ‘అజీర్ణ‘ క్రిమిని పట్టుకుని పీక నులిమేయాలని వుంది. కానీ ఈ క్రిముల పెంపకాన్ని పరిశ్రమగా పెట్టారని తెలిసింది. వారెవ్వరూ తేలేవరకూ ఉరి ప్రశ్నార్థకంగా వేలాడుతూనే వుండాలా? అందాకా ఈ క్రిమిసోకిన వాడి రోగలక్షణాలని జనానికి చెబుదాం. ఈ రోగలక్షణాలున్న మానవేతరులను మచ్చుకి కొందరిని పరిచయం చేస్తాను.

కలవని కనుపాపలు

రెప్పవాల్చని కన్నుల్లా రెండు బావులు

ఒకటి: మాకు

రెండు: మా వాళ్ళకు

మధ్యలో ముక్కుమీద వేలేసుకున్న రోడ్డు

ఎవడో జల్సారాయుడు

వాడక్కూడా

అంటరాని రోగం తగిలించాడు

పుట్టుమచ్చల్లేని కవలల్ని

పచ్చబొట్లతో వేరు చేశాడు

కోడి పందాలు

నేడు సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాల హడావిడి నడుస్తోంది. ఈ కవిత ఎప్పుడో

20యేళ్ళ క్రితం రాసింది. నా ‘పంచమ వేదం’ కవితా సంపుటిలో వుంది. ఈ కోడిపందాలకు నేపథ్యం

పండుగ కాదు, ఒక విషాదం. ముంబయిలో హిందూ,ముస్లింల మధ్య మతకలహాలు చెలరేగిన

నేపథ్యంలో, ఇరు వర్గాలలోని అమాయకపు ప్రజలు బలయ్యారు. నిజానికి ప్రజల మధ్య మత

సామరస్యం ఎప్పుడూ వుంటుంది. స్వార్థ రాజకీయ శక్తులే వారిని రెచ్చగొడతారు. వాళ్ళకాళ్ళకు

కత్తులు కట్టి బరిలోకి దించుతారు. అనుకోకుండా ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం రాష్టంలో

వుంది. చార్మినార్ పక్కన భాగ్యలక్ష్మి మందిర వివాదంతో పాటు, అక్బరుద్దీన్, తొగాడియాల

వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఇబ్బంది కరవాతావరణం నెలకొని వుంది. దాని స్థానంలో స్నేహ

పూర్వక వాతావరణం తిరిగి నెలకొలాని కాంక్షిస్తూ, నా మిత్రుల కోసం మరో మారు ఈ కవిత.

చదవండి.

ఉనికి

ఆమె ఎవరో… ఖరీదయిన దుస్తుల్లో, విలువయిన ఆభరణాలతో, అరుదయిన పెర్ప్యూమ్ పూసుకుని

ఎదురుగా నిలబడింది. పట్టించుకోలేదు. నేనే కాదు. నా మిత్రులు కూడా. చిన్నగా నవ్వింది.

అందరమూ చూశాం. అవును నవ్వే చిన్నది. ఆ నవ్వు పూసిన పెదవులు మరీ చిన్నవి. నిలువెత్తు

అందగత్తెకు ఉనికి ఆ చిన్న నవ్వే. నేను రోజూ వెళ్ళే పార్కుకు ఉనికి చెరువుకు ఓ మూలగా వున్న

చిన్న సిమెంటు సోఫా కావచ్చు. అక్కడ కూర్చున్నప్పుడే పల్చటి గాలి వచ్చి పలకరించి పోతుంది.

చిరు అనుభూతే పెద్ద జీవితానికి ఉనికి.

వేట

ఒక్కొక్కసారి దు:ఖమే కాదు, సంతోషమూ అలజడిని రేపుతుంది. అనుకోని విజయం కలిగిన రోజు కూడా, మనసు కుదురు ఉండదు. కల్లోల సాగరమవుతుంది. అలల్లా కలలు పోటెత్తుతాయి.
గొప్పకలలే కావచ్చు. కలవర పరుస్తాయి. ప్రేయసి కనిపించకుండాపోయినప్పడే కాదు, హఠాత్తుగా కౌగిలి చేరినప్పడూ గుండె గిలాగిలా కొట్టుకుంటుంది. అప్పడు ఎవరన్నా వచ్చి దేవత ప్రశాంతతను బహూకరిస్తే బాగుండునని పిస్తుంది. ఆ దేవత వెలుతురే కానక్కర్లేదు, చీకటి కూడా కావచ్చు.

ముసుగు

పొద్దుకు మంచు మసుగు. పాలకు వెన్నముసుగు. సొంపుకు సిగ్గు ముసుగు. కన్నీటికి కవిత ముసుగు. మమతకూ మమతకూ మధ్యకూడా చిన్న తెరయినా వుండాలి. కానీ వాణిజ్యానికి తెరలుండవు. బంధువు ఇంటికి వచ్చీ రాగానే, ‘మరి వెళ్ళేదెప్పడూ?‘ అని అడిగేది వాణిజ్యమే. కాఫీ డేలో కాఫీ చల్లారే లోగా ‘ప్రేమించేస్కుంటే ఓపనయి పోద్దేమో ’అని ఇద్దరూ బిజినెస్ లైక్ గా లేచిపోతారు. సన్నటి తెరల్ని ఎవరో చించుకుంటూ వెళ్ళిపోతుంటే, మిగిలేది పచ్చితనమే.

నిద్దురే నిజం!

అవును. నాకు నేనే దొరకను. నాలాగా వున్ననేనుతో నాకు పనివుండదు. ఉత్తినే వానలో తడవాలనీ,

ఇసుకలో ఆడాలనీ, దొంగచాటుగా చెట్టునుంచి పచ్చి మామిడికాయ కొట్టుకొచ్చి, పచ్చికారం, ఉప్పూ కలుపుకుని

తినాలనీ ఉంటుందా? సరిగా అప్పడే, మెక్ డొనాల్డ్స్ల్ లో దూరి బర్గర్ తిని, నేను కాని నేనుగా తిరిగి వస్తా. ఎవర్నయినా

గాఢంగా కౌగలించుకోవాలని, కేవలం కరచాలనంతో తిరిగి వచ్చినప్పడు, నా ముఖం నాకే నచ్చదు. మీకేం చూపను?

భూగర్భశోకం

వెలి అంటే- ఊరికి మాత్రమే వెలుపల కాదు, ఉత్పత్తికి కూడా వెలుపల వుంచటం . అంటరానితనమంటే, వొంటిని తాకనివ్వకపోవటం మాత్రమే కాదు, వృత్తిని తాకనివ్వక పోవటం కూడా. వ్యవసాయమే ఉత్పత్తి అయిన చోట, దానికి చెందిన ఏ వృత్తినీ అస్పృశ్యులకు మిగల్చలేదు. అందుకే వారు ఇతరులు చేయటానికి భయపడే (కాటికాపరి లాంటి) వృత్తులూ, చేయటానికి అసహ్యించుకునే(మృతకళేబరాలను తొలగించే) వృత్తులూ చేపట్టాల్సివచ్చింది. అందుకే గుడిలో ప్రవేశించటమే కాదు, మడి(చేను)లోకి చొరబడటమూ తిరుగుబాటే అయింది. ఈ పనిచేసినందుకు లక్ష్మీపేట దళితులను అక్కడి కాపు కులస్తులు నరికి చంపారు. వారి పోరాటస్పూర్తితో వచ్చిందే ‘భూగర్భశోకం’ కవిత.