‘ఫెరా’ సారథి!

పేరు : కె.పార్థ సారధి

దరఖాస్తు చేయు ఉద్యోగం: అంత ఆశ లేదు. ఉన్న ఉద్యోగం(రాష్ట్ర మాధ్యమిక విద్యా శాఖామంత్రి పదవి) ఊడకుండా వుంటే చాలు. (రెండేళ్ళ శిక్ష పడింది. నిజమే. రెండేళ్ళ పదవీ కాలం కూడా వుంది.)

ముద్దు పేర్లు : ‘ఫెరా’సారధి, పార్థ ‘ఫెరా’రథి. ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (ఫెరా) ఉల్లంఘించాననే శిక్ష వేశారు లెండి. (రాజీనామా చేయకుండా పదవినే అంటి పెట్టుకుని వుంటున్నానని కిట్టని వారు కొందరు -‘స్వార్థ’ సారధి అంటున్నారు లెండి. నా అనుచరులయితే ఇప్పటికీ నన్ను ‘నిస్వార్థ’ సారధి అంటారు)

పెద్ద కుర్చీలో ‘చిరు’ నేతా?

రాష్ట్రంలో ‘అకాల’ జ్ఞానులు పెరిగిపోతున్నారు. అడక్కపోయినా, ఆపి మరీ జోస్యం చెప్పేస్తున్నారు. చంద్ర శేఖర సిధ్ధాంతి (కె. చంద్రశేఖరరావు) హఠాత్తుగా వచ్చే నెలలో(సెప్టెంబరులో) తెలంగాణ తేలిపోతుందంటారు. ఈయనకు గతంలో కూడా ఇలాంటి జ్యోతిషం చెప్పిన అనుభవం వుంది. కానీ ఆంధ్ర నుంచి, ఇంకో సిధ్ధాంతి బయిల్దేరారు. ఆయనే రామచంద్ర సిధ్ధాంతి( గుడుల మంత్రి సి.రామచంద్రయ్య). చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని ద్వారాకా తిరుమలలోని ‘కాపు కళ్యాణమంటపం’లో చెప్పారు. వీరు హాస్యాలాడుతున్నారా? లేక జోస్యాలాడుతున్నారా? రాజకీయాల్లో రెంటికీ పెద్ద తేడా ఏమీ వుండదు లెండి.

తుంటరి ‘చేతి’కి ఒంటరి ‘గులాబి’

ఒకప్పుడు ‘సమైకాంధ్ర’ నినాదమిచ్చిన సీమాంధ్ర నేతలెవరూ, తెలంగాణ గడ్డ మీద కేసీఆర్‌కు ఎదురు నిలువ లేదు. ఆ మాట కొస్తే ఉద్యమం ఉధ్ధృతం అయ్యాక కాలు కూడా మోప లేదు. అలాంటిది- ఒకప్పుడు ఇదే కారణం మీద మహబూబా బాద్‌ నుంచి వెనుతిరిగిన వై.యస్‌ జగన్‌, తన తల్లి(విజయమ్మ)నీ, చెల్లి(షర్మిల)నీ తెలంగాణ ఉప ఎన్నికకు ప్రచారానికి పంపిస్తే, కేసీఆర్‌ చోద్యం చూశారు. అంతే కాదు, పరకాలలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ‘నువ్వా-నేనా’ అన్నంతటి పోటీ ఇచ్చి ముచ్చెమట్లు పోయించారు. స్వల్ప ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ పరువు నిలుపు కున్నది కానీ, పట్టు కోల్పోయింది.

మధ్యతరగతి ‘మెట్టు’ వేదాంతం!

అదేమిటో కానీ, గట్టెక్కిన వాడు నీళ్ళలో వున్న వాడికీ; పై మెట్టు మీద వున్న వాడు, కింద మెట్టు మీద వున్న వాడికీ- పాఠం చెప్పేయాలని తెగ ఉత్సాహపడిపోతాడు. సంపన్నుడు మధ్య తరగతి వాడికీ; మధ్య తరగతి వాడు, పేదవాడికీ ఇలా నీతిని బోధించాలని తెగ ఉబలాట పడిపోతారు. ఈ మధ్య కాలంలో మధ్యతరగతి వారి ఉత్సాహం కట్టలు తెంచేసుకుంటోంది. ఏ ఐటీ చదువో వెలగబెట్టి, అంతకు తగ్గ కార్పోరేటు కొలువు పట్టేస్తే చాలు- కింద వారికి చెప్పడానికి నీతి కథలు తన్నుకుంటూ వచ్చేస్తాయి. అలాంటి నీతి పాఠాల్లో, తొలి నీతి పాఠం- ‘అవినీతి పాఠం’.

ఒక్క ‘ఆవిడి’యా రాజకీయాన్నే మార్చేస్తుంది!

‘కుటుంబ నియంత్రణ పాటించాలయ్యా?’

‘నాకున్నది ఇద్దరే కదా సర్‌!’

‘నేనడిగేది పిల్లల గురించి కాదు, కుటుంబాల గురించి.’

‘అయతే… మూడండి.’

ఈ సంభాషణ ఓ అధికారికీ, ఆయన కింద పనిచేసే ఉద్యోగికీ మధ్య జరిగింది.

నిజమే ఒక్కొక్కరూ పెద్దిల్లు కాకుండా చిన్నిల్లూ, బుల్లిల్లూ, చిట్టిల్లూ- ఇలా పెట్టుకుంటూ పోతుంటే, ‘కుటుంబాలు’ పెరిగిపోవూ? అవును కుటుంబాలంటే, పిల్లలు కాదు, భార్యలే.

‘రణ’బ్‌ ముఖర్జీ

పేరు : ప్రణబ్‌ ముఖర్జీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: క్రియాశీల రాష్ట్రపతి( కలామ్‌, ప్రతిభాపాటిళ్ళు ‘నామమాత్రపు’ రాష్ట్రపతుల్లాగానే వున్నారు.) రాష్ట్రపతి పదవి వచ్చింది కానీ, తర్వాత మెట్టు ఇదే.

ముద్దు పేర్లు : ‘దా’.. ‘దాదా’.. ‘రణ’బ్‌ ముఖర్జీ( రణం చేస్తాను కానీ, రాజీ పడి, ‘రబ్బర్‌ స్టాంపు’ గా మారి ‘ప్రణబ్బర్‌’ ముఖర్జీ అని పించుకోను.)

విద్యార్హతలు : మాస్టర్‌ ఇన్‌ ట్రబుల్‌ షూటింగ్‌( కాంగ్రెస్‌ గడ్డుకాలంలో వున్నప్పుడెల్లా గట్టెక్కించే వాడిని.. ఆ పార్టీ గడ్డుకాలంలో లేనిదెప్పుడు లెండి!)

పచ్చ బొట్టూ చెరిగీ పోదూలే..!

చరిత్రంటే- పేరూ, ప్రతిష్ఠలు మాత్రమే కాదు; మచ్చలూ, బొట్లూ కూడా. చెరపటం అంత చిన్న విషయం కాదు. పుట్టు మచ్చంటే, పుట్టు మచ్చే. చచ్చినా చెరగదు. పచ్చ బొట్టూ అంతే. మోజు పడి పొడిపించుకున్నంత ‘వీజీ’ కాదు- చికాకు పడి చెరిపేసుకోవటానికి. ముళ్ళపూడి వెంకటరమణ (‘ముత్యాల ముగ్గు’ కోసం) రాసినట్టు, ‘సెరిత్ర.. ! సెరిపేత్తే సెరిగి పోదు, సింపేత్తే సిరిగి పోదు.’

ఈ రహస్యం మన రాష్ట్ర మంత్రులకు అర్థమయి నట్లు లేదు. అందుకే ‘గోడ మీద రాతల్ని’ చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ సంక్షేమ పథకం మీదా ‘రాజ’ ముద్ర వుండటానికి వీల్లేదు.(అదే లెండి. రాజశేఖర రెడ్డి ముద్ర.)- అంటూ ‘ధర్మాన’ పీఠం దద్దరిల్లింది.

‘ఈ ఏడుపు మాది’

ఏడుపు ఏడుపే. దానికేదీ సాటి రాదు. ఏడుపుకున్న మార్కెట్టు నవ్వుకు వుండదు. ఎవరన్నా ఏడుపుగొట్టు సినిమా తీయటం- పాపం, ఎదురు డబ్బిచ్చి, టిక్కెట్టు కొని ఏడ్చి వస్తాం. సినిమావాళ్ళకు అనవసరమయిన విషయాల్లో సిగ్గెక్కువ. ఏడుపును ఏడుపని అనరు. సెంటిమెంటు- అంటారు. త్రీడీ సినిమాలు చూడటానికి కళ్ళజోళ్ళు పంచినట్లు, సెంటిమెంటు సినిమాలు చూడటానికి చేతిరుమాళ్ళు పంచిన సందర్భాలు కూడా వున్నాయి.

మరీ ఫిలాసఫీ అనుకోకపోతే- ఏడుపులేకుండా, పుట్టుకా లేదు, చావులేదు. కాకపోతే మనిషి పుట్టినప్పుడు తానేడుస్తాడు, చచ్చినప్పుడు ఇతరులు ఏడుస్తారు. నడమంతరపు సిరి నవ్వు. మధ్యలో వచ్చి మధ్యలోనే పోతుంది.

కుర్చీలందు గోడకుర్చీలు వేరయా!

కుర్చీ కే కాదు, కుర్చీ పక్కన కుర్చీకి కూడా విలువ వుంటుందని రాజనీతిజ్ఞులు ఘోషిస్తున్నారు.

క్లాస్‌ రూమ్‌లో ఒకే ఒక కుర్చీ వుంటుంది. దాంట్లో టీచర్‌ కూర్చుంటారు. దాని పక్కన వేరే కుర్చీ వుండదు. కాబట్టి, విద్యార్థులకు కుర్చీ గురించే తెలుస్తుంది కానీ, పక్క కుర్చీ గురించి తెలీదు. కాక పోతే, హోమ్‌ వర్క్‌ చేయని విద్యార్థుల చేత మాత్రం పూర్వం ‘గోడ కుర్చీ’ వేయించే వారు. అంటే లేని కుర్చీని వున్నట్టుగా భావించి కూర్చోవటం. అది కూడా టీచర్‌ పక్కనే అలా కూర్చోవాలి.

కాబట్టే కుర్చీల గురించి చిన్నప్పుడు కలిగిన జ్ఞానమొక్కటే: ఉన్న కుర్చీలో కూర్చోవటం గౌరవం; లేని కుర్చీలో కూర్చోవటం శిక్ష.

టేకి’టీజీ’ వెంకటేష్‌

పేరు : టి.జి.వెంకటేష్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: హై.సీమ ముఖ్యమంత్రి( అంటే హైదరాబాద్‌తో కూడిన రాయలసీమ ముఖ్యమంత్రి)

ముద్దు పేర్లు :’టేకిటీజీ’ వెంకటేష్‌(నన్ను ఎవరైనా తిడితే ‘టేకిటీజీ’ అంటాను. నేను తిట్టిన ఈ ‘ఐయ్యేఎస్‌’లు ఎందుకు తీసుకోరో?

విద్యార్హతలు : బీ ‘కామ్‌’. (అయినా ఎప్పుడూ ‘కామ్‌’ గా వుండను. ఏదో ఒక ఆందోళన చేస్తూనే వుంటాను)

హోదాలు : ఎంత వ్యాపారం చేసినా, ప్రభుత్వాధికారులు పోజుకోడుతున్నారనే కదా- ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత మంత్రి అయ్యాను. మీరే చెప్పండి

జగన్‌ జర్నీలో ‘మజిలీ’స్‌!

జగన్‌ ప్రణబ్‌కు వోటేశారు.

కాంగ్రెస్‌తో ‘మ్యాచ్‌ ఫిక్సింగా’? వెంటనే అనుమానం.

ఇంకేముంది? యుపీయే అభ్యర్థి, కాంగ్రెస్‌లో కీలకమయిన వ్యక్తి ప్రణబ్‌ ముఖర్జీకి వోటెయ్యటమంటే కాంగ్రెస్‌లో కలవటం కాదూ?

నిజంగానే ఇది ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ల సీజన్‌. సంకీర్ణ రాజకీయ యుగంలో- ఇది సహజం.

కానీ, జగన్‌ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ అంటూ వెంటనే చేసుకోవలసి వస్తే, కాంగ్రెస్‌ తో చేసుకోరు. ఒక వేళ అలా చేసుకుని కలిసిపోతే, అది తన పార్టీ(వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ)కి మంచిది కాదు, కాంగ్రెస్‌ పార్టీకీ మంచిది కాదు. నిన్న కత్తులు దూసుకున్న వారు నేడు కౌగలించుకుంటే, అంతే వేగంగా రెండు పార్టీల్లోని కార్యకర్తలూ చెయ్యలేరు.

మోడీ, గోద్రా, ఒక తమిళ అమ్మాయి!?

దేహమంటే మట్టి కాదోయ్‌, దేహమంటే కోర్కెలోయ్‌!

ఇలాగని ఎవరంటారు? ‘దేహ’ భక్తులంటారు. దేశ భక్తుల్లాగే దేహభక్తులుండటం విడ్డూరం కాదు. కానీ ‘దేశభక్తుల్లో’ కూడా ‘దేహ’భక్తులుండం ఆశ్చర్యమే.

సర్వసంగ పరిత్యాగులూ, కాషాయాంబర ధారులూ ‘నిత్యానందులయి’ దేహాల కోసం పరితపించటం కొత్త విషయమేమీ కాదు.

ప్రజాసేవ కోసం తమ అణువణువూ అర్పించేస్తామని ఊరేగే రాజకీయనాయకులూ, ప్రజా ప్రతినిథులూ, దేశభక్తులూ, ఇలా ‘దేహాల వేట’లో వుండటం కూడా వింత కాదు కానీ, దొరికి పోవటం వార్త. ఇటీవలి కాలంలో ఇలాంటి ‘శృంగార పురుషుల’ భాగోతాలు ప్రసారం చేసి బుల్లితెర మరింత చిన్నబోతోంది.