Tag: యెడ్యూరప్ప

తిన్నదెక్కువ, తినిపించింది తక్కువ!

తిను, తినిపించు, లైఫ్‌ అందించు.

ఇదేదో ‘ఎఫ్‌ ఎమ్‌’ రేడియో నినాదం కాదు. చక్కటి రాజకీయ నినాదం. రాజకీయాల్లో వున్నవారు ‘తినటం’ సర్వ సాధారణం. అయితే తాను మాత్రమే ‘తిని’ ఊరుకునే నేతకు పేరు రాదు. ‘వంద’లో ‘తొంభయి’ తాను తిని, ఇతరుల చేతిలో ‘పద’న్నా పెట్టే వాడు ‘మారాజు’ అయిపోతాడు. ఇదీ అవినీతిలో కూడా జనం తీయగల నీతి. ఇన్నాళ్ళూ ఈ ‘నీతి’కి మార్కెట్టుందనుకున్నారు.

కానీ కళ్ళ ముందు ‘కర్ణాటకం’ కనిపించింది. ‘తిని’ ఊరుకున్న వారే కారు, ‘తిని, తినిపించి’న వారు కూడా 2013 అసెంబ్లీ ఎన్నికలలో మట్టి కరిచారు.

యెడ్డి తగవుకు ‘షెట్టర్‌’ వేశారు!

‘కమలం’మీద ‘యెడ్డి’ పడ్డా, ‘యెడ్డి’ మీద కమలం పడ్డా, నలిగేది ‘కమలమే’. కర్ణాటకలో బీజేపీ నలిగి పోయింది. కారణం ‘బిఎస్‌’ యెడ్యూరప్ప.

ఇక్కడ యెడ్యూరప్పకూ, బీజేపీ మధ్య ఒక తగవు నడుస్తోంది. అది ‘చెట్టు ముందా? కాయ ముందా?’ లాంటి తగవు. ఈ తగవు మొదలయి నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇంకా తేల లేదు. 2008లో కర్ణాటకలో బీజేపి గెలిచింది. నమ్మడం కష్టం అయింది అందరికీ, బీజేపీ జాతీయ నేతలయితే ఒక సారి తమను తాము గిచ్చుకుని చూసుకున్నారు. నిజమే. కలకాదు. ‘గెలిచాం’ అనుకున్నారు.

‘చేతులు’ కాలాక ‘పువ్వులు’!

వోటర్లకు చేతులు కాలాయి. ఏం పట్టుకోవాలి? తమిళ వోటర్లయితే ‘ఆకులు’ పట్టుకున్నారు.( జయలలిత పార్టీ అన్నా డిఎంకె గుర్తు రెండు ‘విడాకులు’ లెండి.) తెలుగు వోటర్లయితే .. అందునా తెలంగాణ వోటర్లయితే ‘పూలు’ పట్టుకోవచ్చు. అయితే ఏ పూలు పట్టుకోవాలన్నది సమస్య. మొన్నటి దాకా తెలంగాణ మొత్తానికి ఒకే ఒక పువ్వు వుండేది. అదే (టీఆర్‌ఎస్‌) ‘గులాబీ’ ఇప్పుడు ఇంకొక పువ్వొచ్చి పడింది. అదే (బీజేపీ) ‘కమలం’. అయితే తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించిన ‘జేయేసీ’ కోదండ రామునికి కొత్త సమస్య వచ్చింది. తెలంగాణ తల్లి దగ్గర నిలబడి దగ్గర వారం రోజులుగా ఒకే కీర్తన ఆలపిస్తున్నారు.