అదేమిటో కానీ, గట్టెక్కిన వాడు నీళ్ళలో వున్న వాడికీ; పై మెట్టు మీద వున్న వాడు, కింద మెట్టు మీద వున్న వాడికీ- పాఠం చెప్పేయాలని తెగ ఉత్సాహపడిపోతాడు. సంపన్నుడు మధ్య తరగతి వాడికీ; మధ్య తరగతి వాడు, పేదవాడికీ ఇలా నీతిని బోధించాలని తెగ ఉబలాట పడిపోతారు. ఈ మధ్య కాలంలో మధ్యతరగతి వారి ఉత్సాహం కట్టలు తెంచేసుకుంటోంది. ఏ ఐటీ చదువో వెలగబెట్టి, అంతకు తగ్గ కార్పోరేటు కొలువు పట్టేస్తే చాలు- కింద వారికి చెప్పడానికి నీతి కథలు తన్నుకుంటూ వచ్చేస్తాయి. అలాంటి నీతి పాఠాల్లో, తొలి నీతి పాఠం- ‘అవినీతి పాఠం’.
Month: July 2012
ఒక్క ‘ఆవిడి’యా రాజకీయాన్నే మార్చేస్తుంది!
‘కుటుంబ నియంత్రణ పాటించాలయ్యా?’
‘నాకున్నది ఇద్దరే కదా సర్!’
‘నేనడిగేది పిల్లల గురించి కాదు, కుటుంబాల గురించి.’
‘అయతే… మూడండి.’
ఈ సంభాషణ ఓ అధికారికీ, ఆయన కింద పనిచేసే ఉద్యోగికీ మధ్య జరిగింది.
నిజమే ఒక్కొక్కరూ పెద్దిల్లు కాకుండా చిన్నిల్లూ, బుల్లిల్లూ, చిట్టిల్లూ- ఇలా పెట్టుకుంటూ పోతుంటే, ‘కుటుంబాలు’ పెరిగిపోవూ? అవును కుటుంబాలంటే, పిల్లలు కాదు, భార్యలే.
‘రణ’బ్ ముఖర్జీ
పేరు : ప్రణబ్ ముఖర్జీ
దరఖాస్తు చేయు ఉద్యోగం: క్రియాశీల రాష్ట్రపతి( కలామ్, ప్రతిభాపాటిళ్ళు ‘నామమాత్రపు’ రాష్ట్రపతుల్లాగానే వున్నారు.) రాష్ట్రపతి పదవి వచ్చింది కానీ, తర్వాత మెట్టు ఇదే.
ముద్దు పేర్లు : ‘దా’.. ‘దాదా’.. ‘రణ’బ్ ముఖర్జీ( రణం చేస్తాను కానీ, రాజీ పడి, ‘రబ్బర్ స్టాంపు’ గా మారి ‘ప్రణబ్బర్’ ముఖర్జీ అని పించుకోను.)
విద్యార్హతలు : మాస్టర్ ఇన్ ట్రబుల్ షూటింగ్( కాంగ్రెస్ గడ్డుకాలంలో వున్నప్పుడెల్లా గట్టెక్కించే వాడిని.. ఆ పార్టీ గడ్డుకాలంలో లేనిదెప్పుడు లెండి!)
పచ్చ బొట్టూ చెరిగీ పోదూలే..!
చరిత్రంటే- పేరూ, ప్రతిష్ఠలు మాత్రమే కాదు; మచ్చలూ, బొట్లూ కూడా. చెరపటం అంత చిన్న విషయం కాదు. పుట్టు మచ్చంటే, పుట్టు మచ్చే. చచ్చినా చెరగదు. పచ్చ బొట్టూ అంతే. మోజు పడి పొడిపించుకున్నంత ‘వీజీ’ కాదు- చికాకు పడి చెరిపేసుకోవటానికి. ముళ్ళపూడి వెంకటరమణ (‘ముత్యాల ముగ్గు’ కోసం) రాసినట్టు, ‘సెరిత్ర.. ! సెరిపేత్తే సెరిగి పోదు, సింపేత్తే సిరిగి పోదు.’
ఈ రహస్యం మన రాష్ట్ర మంత్రులకు అర్థమయి నట్లు లేదు. అందుకే ‘గోడ మీద రాతల్ని’ చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ సంక్షేమ పథకం మీదా ‘రాజ’ ముద్ర వుండటానికి వీల్లేదు.(అదే లెండి. రాజశేఖర రెడ్డి ముద్ర.)- అంటూ ‘ధర్మాన’ పీఠం దద్దరిల్లింది.
‘ఈ ఏడుపు మాది’
ఏడుపు ఏడుపే. దానికేదీ సాటి రాదు. ఏడుపుకున్న మార్కెట్టు నవ్వుకు వుండదు. ఎవరన్నా ఏడుపుగొట్టు సినిమా తీయటం- పాపం, ఎదురు డబ్బిచ్చి, టిక్కెట్టు కొని ఏడ్చి వస్తాం. సినిమావాళ్ళకు అనవసరమయిన విషయాల్లో సిగ్గెక్కువ. ఏడుపును ఏడుపని అనరు. సెంటిమెంటు- అంటారు. త్రీడీ సినిమాలు చూడటానికి కళ్ళజోళ్ళు పంచినట్లు, సెంటిమెంటు సినిమాలు చూడటానికి చేతిరుమాళ్ళు పంచిన సందర్భాలు కూడా వున్నాయి.
మరీ ఫిలాసఫీ అనుకోకపోతే- ఏడుపులేకుండా, పుట్టుకా లేదు, చావులేదు. కాకపోతే మనిషి పుట్టినప్పుడు తానేడుస్తాడు, చచ్చినప్పుడు ఇతరులు ఏడుస్తారు. నడమంతరపు సిరి నవ్వు. మధ్యలో వచ్చి మధ్యలోనే పోతుంది.
కుర్చీలందు గోడకుర్చీలు వేరయా!
కుర్చీ కే కాదు, కుర్చీ పక్కన కుర్చీకి కూడా విలువ వుంటుందని రాజనీతిజ్ఞులు ఘోషిస్తున్నారు.
క్లాస్ రూమ్లో ఒకే ఒక కుర్చీ వుంటుంది. దాంట్లో టీచర్ కూర్చుంటారు. దాని పక్కన వేరే కుర్చీ వుండదు. కాబట్టి, విద్యార్థులకు కుర్చీ గురించే తెలుస్తుంది కానీ, పక్క కుర్చీ గురించి తెలీదు. కాక పోతే, హోమ్ వర్క్ చేయని విద్యార్థుల చేత మాత్రం పూర్వం ‘గోడ కుర్చీ’ వేయించే వారు. అంటే లేని కుర్చీని వున్నట్టుగా భావించి కూర్చోవటం. అది కూడా టీచర్ పక్కనే అలా కూర్చోవాలి.
కాబట్టే కుర్చీల గురించి చిన్నప్పుడు కలిగిన జ్ఞానమొక్కటే: ఉన్న కుర్చీలో కూర్చోవటం గౌరవం; లేని కుర్చీలో కూర్చోవటం శిక్ష.
టేకి’టీజీ’ వెంకటేష్
పేరు : టి.జి.వెంకటేష్
దరఖాస్తు చేయు ఉద్యోగం: హై.సీమ ముఖ్యమంత్రి( అంటే హైదరాబాద్తో కూడిన రాయలసీమ ముఖ్యమంత్రి)
ముద్దు పేర్లు :’టేకిటీజీ’ వెంకటేష్(నన్ను ఎవరైనా తిడితే ‘టేకిటీజీ’ అంటాను. నేను తిట్టిన ఈ ‘ఐయ్యేఎస్’లు ఎందుకు తీసుకోరో?
విద్యార్హతలు : బీ ‘కామ్’. (అయినా ఎప్పుడూ ‘కామ్’ గా వుండను. ఏదో ఒక ఆందోళన చేస్తూనే వుంటాను)
హోదాలు : ఎంత వ్యాపారం చేసినా, ప్రభుత్వాధికారులు పోజుకోడుతున్నారనే కదా- ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత మంత్రి అయ్యాను. మీరే చెప్పండి
జగన్ జర్నీలో ‘మజిలీ’స్!
జగన్ ప్రణబ్కు వోటేశారు.
కాంగ్రెస్తో ‘మ్యాచ్ ఫిక్సింగా’? వెంటనే అనుమానం.
ఇంకేముంది? యుపీయే అభ్యర్థి, కాంగ్రెస్లో కీలకమయిన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీకి వోటెయ్యటమంటే కాంగ్రెస్లో కలవటం కాదూ?
నిజంగానే ఇది ‘మ్యాచ్ ఫిక్సింగ్’ల సీజన్. సంకీర్ణ రాజకీయ యుగంలో- ఇది సహజం.
కానీ, జగన్ ‘మ్యాచ్ ఫిక్సింగ్’ అంటూ వెంటనే చేసుకోవలసి వస్తే, కాంగ్రెస్ తో చేసుకోరు. ఒక వేళ అలా చేసుకుని కలిసిపోతే, అది తన పార్టీ(వైయస్సార్ కాంగ్రెస్పార్టీ)కి మంచిది కాదు, కాంగ్రెస్ పార్టీకీ మంచిది కాదు. నిన్న కత్తులు దూసుకున్న వారు నేడు కౌగలించుకుంటే, అంతే వేగంగా రెండు పార్టీల్లోని కార్యకర్తలూ చెయ్యలేరు.
మోడీ, గోద్రా, ఒక తమిళ అమ్మాయి!?
దేహమంటే మట్టి కాదోయ్, దేహమంటే కోర్కెలోయ్!
ఇలాగని ఎవరంటారు? ‘దేహ’ భక్తులంటారు. దేశ భక్తుల్లాగే దేహభక్తులుండటం విడ్డూరం కాదు. కానీ ‘దేశభక్తుల్లో’ కూడా ‘దేహ’భక్తులుండం ఆశ్చర్యమే.
సర్వసంగ పరిత్యాగులూ, కాషాయాంబర ధారులూ ‘నిత్యానందులయి’ దేహాల కోసం పరితపించటం కొత్త విషయమేమీ కాదు.
ప్రజాసేవ కోసం తమ అణువణువూ అర్పించేస్తామని ఊరేగే రాజకీయనాయకులూ, ప్రజా ప్రతినిథులూ, దేశభక్తులూ, ఇలా ‘దేహాల వేట’లో వుండటం కూడా వింత కాదు కానీ, దొరికి పోవటం వార్త. ఇటీవలి కాలంలో ఇలాంటి ‘శృంగార పురుషుల’ భాగోతాలు ప్రసారం చేసి బుల్లితెర మరింత చిన్నబోతోంది.
‘ఏటూజెడ్’ యూరప్ప!
పేరు : బి.ఎస్. యెడ్యూరప్ప
దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘నాజీ’ ముఖ్యమంత్రి. (అంటే మామూలు ‘మాజీ’ ముఖ్యమంత్రి అని కాదు. నియతలా శాసించే ముఖ్యమంత్రి అన్న మాట.)
ముద్దు పేర్లు : ఎ-టూ-జెడ్ యూరప్ప(కర్ణాటక లో బీజేపీ యూనిట్ వరకూ ఆది నుంచి అంతం వరకూ నేనే.)
విద్యార్హతలు : గుమస్తా పనికి సరిపోయే చదువనుకునేరు. అదే సమస్తానికి సరిపోతుంది. నా క్యాంపులో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో, లెక్కలేసుకోవటానికి ఆ మాత్రం చదువు చాలదా?
సిఎం సీటు ‘బీసీ’కా? ‘సీబీ’కా?
వంద సీట్లు. వెయ్యి కోట్లు. లక్ష ఫీట్లు.
ఇవీ బీసీల వోట్ల కోసం చంద్రబాబు పాట్లు.
ఇది విజన్ 2020 కాదు, రీజన్ 2014.
అనుమానం లేదు. ఇది ఎన్నికల గణితమే. ఆయన లెక్కల్లో మనిషి. ఇంతకు ముందు ఎన్నికల్లో ఇలాగే ‘నగలు బదలీ’ లెక్కలు వేశారు. ‘ఆల్ ఫ్రీ’ కూడికలు వేశారు. కానీ జనానికి ‘తీసివేత’లే అర్థమయ్యాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ‘తీసి వేశారు’.
జూనియర్ ఆట అదుర్స్!
‘రాణి’నీతి లేదా?
అప్పుడు రాణిని ‘కొప్పుపట్టి ఈడ్చుకు రమ్మని’ ధుర్యోధనుడు శాసిస్తే, దుశ్సాసనుడు అమలు చేస్తాడు. నిండు సభలో వలువలు వలుస్తారు. ఉత్త ‘నీతి’ని వల్లించే పెద్దలు అచేతనులయి చూస్తారు.
భారతం, భారతమే. ‘కళ్ళుమూసుకుని’ పాలించే పాలకులున్న చోట, దేశంలోని అంగుళం, అంగుళమూ కురుసభగానే మారిపోతుంది. అందాకా గువహతి(అసోం)లో ఒక ‘ఆరు బయిట’ (అదేలెండి ‘బారు బయిట’) నాలుగు రోజుల క్రితం ఈ కురుసభను నిర్వహించారు.
శిశువు నేడు లేచెను
రెండు దశాబ్దాల క్రితం చుండూరు(ప్రకాశం జిల్లా)లో ఇప్పుడు లక్ష్మీపేటలో జరిగినట్లే దళితుల మీద దాడి చేశారు. ఇప్పుడు చంపింది కాపుకులస్తులయితే, అప్పడు చంపింది రెడ్డి
భూస్వాములు. అప్పడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోవుంది. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన రెడ్డి. పంటపొలాల్లో దళితకూలీలను తరిమి తరిమి చంపి వారి
శవాలను గోనె సంచుల్లో మూట కట్టి మురికి కాలువలో పడేశారు. ఈ ఘటనకు దేశం నలుమూలలా దళితుల తల్లడిల్లారు. దళిత సంఘాల వారు వారు శవాలను వెలికి తీసి, నిరసనగా
ఊరి మధ్యలో పాతి పెట్టారు. పాత్రికేయుడిగా వార్త కోసం వెళ్ళి చూసి వచ్చాక నా మనసు మనసులో లేదు. అప్పడు రాసిందే ఈ కవిత. తెలుగు కవిత్వాభిమానులకు
పరిచితమయినదే. అయిన లక్ష్మీపేట దాడి నేపథ్యంలో ఎందుకో మిత్రులతో పంచుకోవాలనిపించింది.
ఆవేశంలో ఆమె సగం!
సమస్య అంటేనే స్త్రీ. స్త్రీ అంటేనే సమస్య. ఇది ఇంటి భాగోతం.
సమరం అంటేనే స్త్రీ. స్త్రీ అంటేనే సమరం. ఇది వీధి భారతం.
కేవలం రెండే రెండు దశాబ్దాలలో దేశ పోరాట చిత్రపటాన్ని మార్చేశారు స్త్రీలు. ఇలా అనగానే కేవలం స్త్రీలుగా తమ సమస్యలపైనే తాము పోరాటం చేశారనే నిర్థారణకు రావచ్చు. పురుషులు సైతం ఎదుర్కొనే ఇబ్బందుల మీద కూడా పిడికిళ్లు బిగించారు.
కాకుంటే, తమ పోరాటాలను వెను వెంటనే రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని మాత్రం వీరు భావించలేదు. అదే జరిగితే, పాలన మొత్తాన్ని తలక్రిందులు చేయగలుగుతారు.
యెడ్డి తగవుకు ‘షెట్టర్’ వేశారు!
‘కమలం’మీద ‘యెడ్డి’ పడ్డా, ‘యెడ్డి’ మీద కమలం పడ్డా, నలిగేది ‘కమలమే’. కర్ణాటకలో బీజేపీ నలిగి పోయింది. కారణం ‘బిఎస్’ యెడ్యూరప్ప.
ఇక్కడ యెడ్యూరప్పకూ, బీజేపీ మధ్య ఒక తగవు నడుస్తోంది. అది ‘చెట్టు ముందా? కాయ ముందా?’ లాంటి తగవు. ఈ తగవు మొదలయి నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇంకా తేల లేదు. 2008లో కర్ణాటకలో బీజేపి గెలిచింది. నమ్మడం కష్టం అయింది అందరికీ, బీజేపీ జాతీయ నేతలయితే ఒక సారి తమను తాము గిచ్చుకుని చూసుకున్నారు. నిజమే. కలకాదు. ‘గెలిచాం’ అనుకున్నారు.
నానుంచి నేను
ఎక్కడెక్కడికో కదలిపోతుంటాం. పోటెత్తి ప్రవహిస్తూ వుంటాం. సముద్రంలో కలసిపోతుంటాం. సూర్యుడి వెచ్చని కౌగలింతకు ఆవిరయి పోతూ వుంటాం. మేఘాలయి గర్జిస్తుంటాం. కాని పిల్లగాలికే పులకించి పోతుంటాం. నిలువెల్లకరిగి వర్షిస్తుంటాం. ప్రవాహంలో నేనొక బిందువూ. నీవొక బిందువూ. కాస్సేపు వేరు వేరుగా. కాస్సేపు సమూహంగా. మధ్యలో వచ్చి పోయే చావు పుట్టుకలు కమర్షియల్ బ్రేకులు.
ఊరించిన విషయానికి కిక్కెక్కువ!
అబధ్ధం చురుకయినది. పుట్టగానే పరుగెత్తుతుంది.
నిజం సోమరి. వెళ్ళవచ్చులే- అని బధ్ధకిస్తుంది.
పుకారు కున్న స్పీడు, వార్తకు వుంటుందా? పుకారును వ్యాప్తి చేయటానికి ప్రత్యేకించి ప్రసార సాధనం అవసరం లేదు. దానంతటదే వ్యాప్తి చెందుతుంది. కానీ, వార్తకంటూ ఒక సాధనం వుండాలి.
అందుకే అంటారు మరి- ‘సత్యం చెప్పులు వేసుకునేలోగా అసత్యం లోకం చుట్టి వస్తుందని’.
కారణం మార్కెట్. అబధ్దానికున్న డిమాండ్, నిజానికి వుండదు. అబధ్ధానికి ఎదురువెళ్ళి స్వాగతిస్తారు. అసత్యవాక్కులను ఎగబడి కొంటారు.
కొక్కొ ‘రోకో’ నారాయణ
కేంద్రంలో ‘పంబలకిడి జంబ’
రాజకీయంగా దేశం ఎలా వుంది? ఏదో గాలివాన వచ్చి కొట్టేసినట్టుంది. మహా వృక్షాలు కూలిపోయాయి. చిన్న చిన్న మొక్కలు తలలెత్తి నిలుచున్నాయి. జాతీయ పక్షాలు జాలిగొలిపే పార్టీలుగా కూలబడిపోతుంటే, ప్రాంతీయ పక్షాలు పెత్తనం చేసే పార్టీలుగా స్థిరపడిపోతున్నాయి.
ఇదే పరిస్థితి కొనసాగితే, 2014లో పరిస్థితి ‘జంబలకిడి పంబ’ కాస్తా, ‘పంబలకిడి జంబ’ అయ్యే లా వుంది. (పురుషులపై స్త్రీలు ఆధిపత్యం చెలాయించటం ‘జంబలకిడి పంబ’ అయితే, పెద్దలపై పిల్లలు ఆధిపత్యం చేయటం ‘పంబలకిడి జంబ’ అని ఒక సినిమాలో సూత్రీకరిస్తారు.)