రాష్ట్రంలో కాంగ్రెస్‌ రాజీ ఫార్ములా: లాభసాటి ఓటమి!

తెలంగాణ!

తేల్చేస్తే తేలిపోతుంది

నాన్చేస్తే నానిపోతుంది.

తేలిపోతే, కాంగ్రెస్‌ తేలుతుందా? మునుగుతుందా? ఇప్పుడున్న స్థితిలో తేల్చకపోయినా మునుగుతుంది.

మునిగిపోవటం తప్పదన్నప్పుడు కూడా, కాంగ్రెస్‌ తేలే అవకాశం కోసం ప్రయత్నిస్తోంది. ఇది కొత్త పరిణామం. తేల్చటం వల్ల కాకుండా, నాన్చటం వల్లే ఈ ప్రయత్నం ఫలించగలదని ఆ పార్టీ నమ్ముతున్నట్టుగా కనిపిస్తోంది.

తెలంగాణ కథ మొదలుకొస్తుందా?

సెప్టెంబరు 30, 2012 .ఇది తేదీ కాదు. ముహూర్తం. సాక్షాత్తూ ‘చంద్రశేఖర సిధ్దాంతి’ పెట్టిన అనేకానేక ముహూర్తాల్లో ఇది ఒకటి. ఆయన లెక్క ప్రకారం ఈ తేదీ లోగా తెలంగాణ సమస్యకు ‘శుభం’ కార్డు పడిపోతుంది. ఆయన ప్రత్యేక ‘పంచాంగం’లో ఇలాంటి తేదీలు ఇంతకు ముందు చాలా గడచిపోయాయి. అయితే ముహూర్త బలాన్ని ఏమాత్రం శంకించాల్సిన పనిలేదు. ఎటొచ్చీ ఆయన ముహూర్తం పెట్టే వాడే తప్ప, శుభకార్యం జరిపించే వాడు మాత్రం కాదు.

కలసి రాకే, ‘కుల’కలం!

అడుగులు తడబడినప్పుడెల్లా బడుగులు గుర్తుకొస్తారు.

తెలుగు దేశం , కాంగ్రెస్‌ పార్టీలకు నడక సాగటం లేదు. కాంగ్రెస్‌ పరిస్థితి మరీ దారుణం. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనూ అడుగు తీసి, అడుగు వేయలేక పోతోంది.

టార్చిలైట్‌ వేసి వెతికినా, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వం- అన్నది కానరావటం లేదు.అక్కడ ప్రధాని మన్‌ మోహన్‌ సింగ్‌ ‘ఉన్నారో, లేదో తెలియదు.’ ఇక్కడ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి -‘ఉంటారో, ఊడతారో’ తెలియదు.

ప్రధాని తన ముఖానికే బొగ్గు ‘మసి’ రాసుకుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి తన ‘కేబినెట్‌’ ముఖానికి ‘వాన్‌పిక్‌’ తారు పులిమేశారు.

భూగర్భశోకం

వెలి అంటే- ఊరికి మాత్రమే వెలుపల కాదు, ఉత్పత్తికి కూడా వెలుపల వుంచటం . అంటరానితనమంటే, వొంటిని తాకనివ్వకపోవటం మాత్రమే కాదు, వృత్తిని తాకనివ్వక పోవటం కూడా. వ్యవసాయమే ఉత్పత్తి అయిన చోట, దానికి చెందిన ఏ వృత్తినీ అస్పృశ్యులకు మిగల్చలేదు. అందుకే వారు ఇతరులు చేయటానికి భయపడే (కాటికాపరి లాంటి) వృత్తులూ, చేయటానికి అసహ్యించుకునే(మృతకళేబరాలను తొలగించే) వృత్తులూ చేపట్టాల్సివచ్చింది. అందుకే గుడిలో ప్రవేశించటమే కాదు, మడి(చేను)లోకి చొరబడటమూ తిరుగుబాటే అయింది. ఈ పనిచేసినందుకు లక్ష్మీపేట దళితులను అక్కడి కాపు కులస్తులు నరికి చంపారు. వారి పోరాటస్పూర్తితో వచ్చిందే ‘భూగర్భశోకం’ కవిత.

ప్రజాస్వామ్యంలో రాచరికం!

దేవుడు లేక పోతే ఏమయింది? వెంటనే ఒక దేవుణ్ణి సృష్టించండి. ఇదో పాత సూక్తి. రాజులేక పోతే నష్టమేముంది? వెంటనే రాజునో లేక రాజునో సృష్టించండి. మన దేశ వర్తమాన చరిత్రను చూసినప్పుడెల్లా ఈ సూక్తిని ఇలా కొత్తగా మార్చుకోవాలనిపిస్తుంది. ఆలోచించటానికి బధ్ధకమయినప్పుడో, మృత్యువుభయపెట్టినప్పుడో-కొందరు నిజంగానే దేవుడుంటే బాగుండుననుకుంటారు. ఉన్నట్టు విశ్వసిస్తారు. ప్రజాస్వామ్యం వచ్చేశాక కూడా, రాచరికం మనస్సులో వుండి పోతుంది. కారణం కూడా అంతే.

‘వెనకబడ’తారు!’అంటు’కుంటారు!!

ఏ పార్టీకయినా హఠాత్తుగా ‘అంటరానివారు’ గుర్తొచ్చారంటే, ఆ పార్టీని వోటర్లు ‘వెలి’ వేశారని అర్థం చేసుకోవాలి. అలాగే ‘వెనుబడిన వారు’ గుర్తొచ్చారంటే ఆ పార్టీ వోట్లవేటలో ‘వెనుకబడిందీ’ అని అర్థం. ఆ లెక్కన చూసుకుంటే, పార్టీలన్నీ అయితే ‘అంటరాని’వో లేక, ‘వెనుకబడినవో’ అయినట్లే.

సోనియా కోపం- రాహుల్‌ కోసం!

సోనియా గాంధీ ‘బొగ్గు’ మన్నారు. పార్లమెంటు ‘మసి’బారింది. సమావేశాల్లో మరో రోజు ‘బ్లాక్‌’ డేగా మారింది. ఏమిటో అంతా ‘నలుపే’. బొగ్గు గనుల కేటాయిపుల అవకతకలపై ‘కాగ్‌’ నివేదిక చూశాక కాగి పోవాల్సింది ప్రతి పక్షం. కానీ, అదేమిటో పాలక పక్షం ఊగిపోతోంది. బీజేపీకి ‘బ్లాక్‌ మెయిలింగే బువ్వ’ అన్నారు సోనియా. బీజేపీ నేతలకు – ‘బ్లాక్‌’ మెయిలింగ్‌ లో ‘బ్లాక్‌’ ఒక్కటే అర్థమయింది. నలుపుకు నలుపే సమాధానం అనుకున్నారో ఏమో సమాధానం కూడా ‘నలుపు’తోనే ఇచ్చారు.

‘ధర్మాన’ పీఠం దద్దరిల్లింది!

‘కిరణ’ం ప్రకాశించటం లేదు. రాష్ట్రంలో ఇది వార్త కాదు.

ఎందుకు ప్రకాశించటం లేదు? ఇదీ ప్రశ్న.

ఈ ప్రశ్నకు పలువురూ ఇచ్చే జవాబు వేరు. పార్టీ అధిష్ఠానం వెతుక్కుంటున్న సమాధానం వేరు.

కిరణంలో కాంతి తక్కువయిందని అందరూ అంటారు.

కానీ, పార్టీ హైకమాండ్‌ అలా అనదు. చుట్టూ చీకటి తక్కువయిందీ- అని అంటుంది.

అందుకే కాబోలు- ‘కిరణ్‌’ చుట్టూ చీకట్లు పెంచుతోంది.

కిరణ్‌ మంత్రి వర్గంలో ‘కళంకితుల’ శాతం పెరుగుతున్న కొద్దీ, ఆయన ఉనికి పెరుగుతుందన్నది హైకమాండ్‌ భావన కాబోలు. ఇంతవరకూ మిణుకు మిణుకు మని దిగులుగా మెరుస్తున్న ‘కిరణం’ ఇప్పటికయినా ప్రకాశవంతంగా కనిపించక పోతుందా-అని ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలకు చిగురంత ఆశ కాబోలు.

గాంధీ భవన్‌లో ‘ప్రజారాజ్యం’?

2014. ఇది ఒక అంకె కాదు. ఒక గురి. చేప కన్ను. మన రాష్ట్రంలో నే కాదు, కేంద్రంలో కూడా అందరి లక్ష్యం 2014.

ఈ ‘విజన్‌ 2014’ను సాకారం చేసుకోవటానికి ఎవరి కసరత్తు వారు చేస్తున్నారు. అన్ని పార్టీల కన్నా, అధికారంలో వున్న కాంగ్రెస్‌ ఎక్కువ హడావిడి చేస్తోంది. ఢిల్లీలో రాహుల్‌ని ప్రధానిని చెయ్యాలి. అందుకు తగ్గట్టుగా పెద్ద రాష్ట్రాలన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎక్కువ పార్లమెంటు సీట్లను కొట్టేయాలి. రాష్ట్రంలో మరో మారు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఇదే ‘సోని(యా) విజన్‌ 2014.

కిరణ్‌-పాల్‌ గ్యాస్‌ ట్రాజెడీ!

వెనకటికి, ఒక హాలీవుడ్‌ తార పనుల హడావిడిలో పడి, తన పెళ్ళికి తాను హాజరు కావటం మరచిపోయిందట. కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి కూడా ఈ మధ్య తన సన్మాన సభకు తాను గైర్హాజరయ్యారు. ఆయనకూ పనుల హడావిడే నంటే నమ్ముతారా? నమ్మరు. ‘అంతా. గ్యాస్‌’ అంటారు. ఇప్పుడు కాంగ్రెస్‌ నిండా ‘గ్యాసే’. పడని ఇద్దరి కాంగ్రెస్‌ నేతల మధ్య ‘గ్రాసే'(పచ్చగడ్డే) వేయ నవసరం లేదు. కొంచెం ‘గ్యాస్‌’ వేసినా చాలు. భగ్గు మంటుంది.

అన్నా ‘బేజారే’!

పేరు : అన్నా హజారే

దరఖాస్తు చేయు ఉద్యోగం: మాజీ మహాత్ముడు ( అంతా రాని ‘లోక్‌పాల్‌’ మహిమ. లేకుంటే, మాజీ సైనికుడిగానే మిగిలిపోయేవాణ్ణి)

ముద్దు పేర్లు : అన్నా( ముచ్చటొచ్చి ‘అన్నా’నంటారు. నిజంకాదు. నేనేదయినా ‘అన్నా’నా? కేవలం విన్నానంతే-కిరణ్‌ బేడీ చెప్పిందీ,కేజ్రీవాల్‌ చెప్పిందీ.), ‘బేజారే'(లక్షల్లో జనాన్ని చూసి ఏడాది తర్వాత వందల్లో చూడాల్సి వస్తే బేజారు గా వుండదూ!)

విద్యార్హతలు : నేనొప్పుకోను.. విద్యే అర్హత అంటే నేనొప్పుకోను. ఏడవతరగతి వరకూ చదువుకున్నాను. మనదేశంలో రాజ్యాంగాన్ని విమర్శించటానికి, మార్చటానికి చదువు అవసరమంటారా?(రాయటానికయితే చదువులు కావాలేమో లెండి.)

Will Aruna Bahuguna Succeed Dinesh Reddy As DGP?

Can woman be the Top Cop in Andhra Pradesh? The day a female IPS officer to assume the highest office of the Police, Director General of Police(DGP) is not far off. The three officers of 1979 cadre, among which the Chief Ministers has to make a choice to succeed Dinesh Reddy, fortunately include a woman too. She is none other than Aruna Bahuguana. The other two are: S.A Huda and B.Prasada Rao.