ఈ ప్రజాస్వామ్యం ఏమిటో కానీ,
ఇక్కడ ఎవ్వరూ హోం వర్క్ చెయ్యరు.
వోటరు దగ్గర నుంచి బ్రోకరు వరకూ, కేడర్ మొదలు లీడర్ వరకూ- అంతే. ఒక్క ‘మందు’ తప్ప ఏదీ ముందు సిధ్ధం చేసుకోరు.( వీరికి ముందు జాగ్రత్త అనే మాట ‘మందు’ జాగ్రత్త లాగా వినిపిస్తుంది).
పోటీలో వున్న ఫోర్ట్వంటీలెందరో కనీసం లెక్కకూడా పెట్టుకోడు వోటరు.
‘నేను ‘నొక్కాల్సిన’ ఫోర్ట్వంటీ గాడెవడో చెప్పు. మిగతా వాళ్ళు నాకనవసరం’ అని బూత్లోకి వెళ్ళే ముందు అడిగి వెళ్ళి ‘ఈవీఎం’ (ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్) మీట నొక్కేసి వస్తాడు. ఎన్నో వేలిముద్రలు నొక్కిన వాడికి ఈ ముద్రో లెక్కా?
భయ..భయ..భయహే!
ఆయుధమంటే చాలు అదిరిపడి చస్తారు ఎందుకో..?
ఉన్నట్టుండి యోగా(రామ్ దేవ్)బాబా తన అనుచరులకు ‘శస్త్రం’ ఇస్తానన్నారు. చిదంబరం నుంచి ఏకాంబరం వరకూ దేశంలో అందరూ ఉలిక్కి పడ్డారు.
గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ తన అభిమానులకి లాఠీలు(కర్రలు) ఇచ్చి ప్రదర్శన చేయించారు. అవీ ఆయుధాలే కదా! అప్పుడూ ఇలాగే… అందరూ ‘బుర్రలు బద్దలు కొట్టు’కున్నారు.. లాఠీలతో కాదు… సందేహాలతో…!
‘ఇతను ఉగ్రవాదిలా రెచ్చిపోతున్నాడేమిటి..? కొంప దీసి ‘ఆల్ ఖైదా’ లాగా ‘లాల్ ఖైదా’ లాంటి సంస్థను గాని స్థాపించలేదు కదా- అని అనుమానించారు కదా!
విశ్వాసానికి విడాకులు
విశ్వాసం వుండాల్సింది కుక్కలకీ నక్కలకీ కానీ, మనుషులకెందుకు చెప్పండి?
ఇప్పుడు ఉంటున్న ఇంటికి తాళం వేస్తున్నారు. ఒకప్పుడు ఉంచుకున్న ఒంటికి తాళం వేసే వారు. ఎందుకూ? అవిశ్వాసం? మనుషుల్లో దొంగ మనుషులుంటారనీ, వారు కన్నం వేస్తారనీ- గొప్ప అవిశ్వాసం.
కుక్కలతో అలాంటి పేచీలేదు. వాటిల్లో మహాఅయితే పిచ్చికుక్కలు వుంటాయేమో కానీ, దొంగ కుక్కలు వుండవు.
అందుకే అవిశ్వాసమన్నది ముమ్మాటికీ మానవ ప్రవృత్తి.
కోతి నుంచి మానవుడు అవతరించే పరిణామ క్రమంలో, మెల్లిగా తోక అంతరించిపోతూ, దాని స్థానంలో అవిశ్వాసం పెరుగుతూ వచ్చింది.
అర్థనీతి పరులు
అవినీతిని చూస్తే ఒకప్పుడు కోపం వచ్చేది. కానీ ఇప్పుడు కడుపు మంట పుడుతోంది.
రూపాయి మీద ఒట్టు. కోపం వేరు. కడుపు మంట వేరు.
అందగత్తె ఐశ్యర్యారాయ్ను చూస్తే అనాకారులయిన అప్పలమ్మలకి వచ్చేది కోపం; కానీ అంతో ఇంతో అందగత్తెలకు వచ్చేది మాత్రం కడుపు మంటే.
బుద్ధివున్న వాణ్ణి చూస్తే, బుర్రలేని వాడికి వచ్చేది కోపం; సగం బుర్ర వున్నవాడికి వచ్చేది కడుపు మంట.
అలాగే..,
బిర్యానీ మెక్కే వాణ్ణి చూస్తే , తిండి లేనివాడికి వచ్చేది కోపం; తెల్లన్నం తినేవాడికి వచ్చేది కడుపు మంట.
ఇప్పుడు దేశం మొత్తం… కోపంతో ఊగిపోవటం లేదు. కడుపు మంటతో కాలిపోతోంది. కారణం అవినీతి.
సీత చేతి ఉంగరం
వాగ్గేయకారుడుగా జయరాజు తెలుగువారికి సుపరిచితుడు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఆయన పాటలు వినని వారుండరు. పలు చిత్రాలకు ఆయన పాటలు రాశారు. వామపక్ష ఉద్యమాలకు బాసటగా ఆయన సాహిత్యం నిలిచింది. కార్మికనేతగా, కళాకారుడిగా ఆయన ఉద్యమజీవితంగా సాగించారు. సాగిస్తున్నారు కూడా. ఆయన తన పాతికేళ్ళ సాహిత్యప్రస్థానానికి గురుతుగా వేసిన ‘వసంత గీతం’ పుస్తకానికి రాసిన ముందు మాట ఇది.
నిన్నటి కలలే నేటి అలలు!
శ్రీశ్రీ పక్కన నిలుచున్నా, సముద్రపు వొడ్డున కూర్చున్నా ఒక్కటే. చిరుకోపం వుంటే మహోద్రేకమవుతుంది. కొంచెం దు:ఖమే కావచ్చు. దావాలనమవుతుంది. చిన్ననవ్వే పెనుసంబరంగా మారుతుంది.
శ్రీశ్రీ సముద్రమంతటి ఉత్ప్రేరకం. వామనుడికి సైతం విశ్వరూపాన్ని ప్రదర్శించగల శక్తి అది. శ్రీశ్రీ చైన్నైలో వున్నా, విశాఖలో వున్నా సముద్రాన్ని ప్రేమించేవాడు. సముద్రంలేని చోట వుండటానికి ఇష్ట పడేవాడు కాడు.
డెరెక్ వాలకాట్కి సముద్రమంటే ఎంత ఇష్టమో, శ్రీశ్రీకీ సముద్రమన్నా అంతే ఇష్టం. సముద్రాన్ని కోల్పోవటం చిన్న విషయం కాదు. ‘సముద్రాన్ని కోల్పోయిన జీవితం దేహాన్ని కోల్పోయిన వస్త్రం లాంటింద’న్నాడు వాల్కాట్ చమత్కారంగా.
‘కడగని’ పాత్రలు ఈ ‘నెగెటివ్’లు!
ఇలా రాసిందే రచన- అని ఏ రచయితనీ బెదరించలేం. ఇలా పెట్టిందే గుడ్డు- అని ఏ పిట్టనీ
వణికించలేం. అలా చేస్తే రాసింది రచనా కాదు. పెట్టింది గుడ్డూ కాదు. రచయితలంతా పుస్తకాలలోనుంచో,
విశ్వవిద్యాలయాల్లోంచో, పత్రికల్లోంచో పుట్టుకురావాలన్న షరతు కూడా లేదు. కల్లు కాంపౌండులోంచో, రెడ్ లైట్
ఏరియాలోంచో, వెలివాడలోంచో రచయిత పుట్టుకురావచ్చు. గుడ్లు పెట్టే వన్నీ ఫోరం కోళ్ళే కావాలని రూలు
లేదు. అడవిలోని కోడి కూడా గుడ్డు పెడుతుంది.
కెమెరా విజయకుమార్ రాయలని పథకం వేసుకుని రాయలేదు. రాయకుండా వుండలేక
రాసేశాడు. తాను వెనక్కి తిరిగి చూసుకునే సరికి రచయిత అయిపోయాడు. ఇంకేచేస్తాడు? తప్పించుకోలేడు.
ఊరందరి బెంగల్నీ మొయ్యాల్సిందే. అందుక్కూడా ఆయన సిధ్ధపడ్డాడు. కానీ ఊరువరకూ ఆయన్ని వెళ్ళనిస్తే
కదా! వాడ బెంగలే కాళ్ళకు చుట్టుకున్నాయి. ఇంక కదలితే వొట్టు.
అందితే బేరం! అందకుంటే నేరం!
కళ్ళు మూసుకుంటే పదేళ్ళు గడిచిపోయాయి.
కాదు.. కాదు.. మనమంతా కళ్ళు మూసుకుంటూనే గడిచిపోయాయి..
పులులు ప్రోటీన్లున్న గడ్డి తిని బలుస్తున్నాయన్నారు. కళ్ళు తెరిచి చూడలేక పోయాయి.
లేళ్ళు కేవలం కార్బోహైడ్రేట్లు అన్నం తిని చిక్కి పోతున్నాయన్నారు. చూసే ధైర్యం చెయ్యలేక
పోయాం.
నీళ్లు లేని చోటకు నీళ్ళొస్తున్నాయి- అంటే పొలాల్లో వెతికాం. కానీ మునిగినవి కొంపలు.
చూసినా ప్రయోజనం లేదని కళ్ళు తెరవలేదు.
రైతుల ఆత్మహత్యలు వుండవు. అన్నారు. ఈ మాట మాత్రం నిజం. రేపు రైతే వుండడు. ఆ
పని కార్పోరేటు వ్యాపారి చేస్తాడు. ఆ సుందర దృశ్యం రేపు తర్వాత చూడవచ్చని కళ్ళు తెరవలేదు.
అతనెవరో ‘నాటు బాంబు నెత్తిమీద ఖద్దరు టోపీ’ పెట్టి- ‘అహింసా వర్థిల్లాలి’ అన్నాడు. చాలా
మంది ప్రత్యర్థులు నెత్తుటి మడుగుల్లో తేలారు. భయం వేసి కళ్ళు తెరవలేదు.
మిగిలిన ఒకరిద్దరూ ‘కంప్యూటర్’లో దాక్కుండి పోయి, సౌకర్యవంతంగా సవాళ్లు విసిరారు.
చూడటానికి విసుగనిపించి కళ్ళు తెరవలేదు.
అందితే బేరం! అందకుంటే నేరం!
మనమంతా కళ్ళు మూసుకుంటేనే పదేళ్ళూ గడిచిపోయాయి.
చిత్త ప్రసాద్ ‘రాతబడి’ చేశాడు!
నంది అంటే నంది
పంది అంటే పంది
అనే వాళ్ళను వంది మాగధులంటారు. ‘పంది’మాగధులని ఎందుకనరో!
అలాంటి ‘పంది’మాగధుడే ఒక ‘మధురమయి’న రాజ్యంలో ప్రధాన మంత్రిగా చెలామణీ అయిపోతున్నాడు.
ఆ రాజ్యం పేరు ‘రసగుల్లా రాజ్యం’. మంత్రికీ, రాజ్యానికీ ఏ మాత్రం పొంతన లేదు కదూ!
అందమైన దేశానికి అసహ్యకరమైన మంత్రి ఎందుకొస్తాడు? రాజుకు బుధ్ధిలేక పోతే సరి!
బుధ్ధిలేని రాజూ, గడ్డితినే మంత్రీ ఉద్యానవనంలో విహరిస్తుండంగా, నిజంగానే ఇద్దరూ పందిని చూశారు.
‘ఏమిటది?’ అన్నాడు బుధ్ధిలేని రాజు.
చిత్రం! పందిని పంది- అని చెప్పలేదు గడ్డితినే మంత్రి.
‘బక్కచిక్కిన ఏనుగు’ అన్నాడు.
‘ఫుడ్’ పాత్
పరమహంస చచ్చిపోయాడు.
కానిస్టేబుల్ పరమహంస దీనాతి దీనంగా, ఘోరాతి ఘోరంగా, హీనాతి హీనంగా పోయాడు.
అత్యంత చౌకబారుగా, అడుక్కునే వాడి చేతిలో అర్థరాత్రి అసువులు బాపాడు.
ఫుట్ పాత్ మీద ఆడ్డంగా బోర్లాపడివుంది శవం.
టాటాసుమో ఇంకా ఆగకుండానే దూకి వచ్చాడు డీసీపీ తాండవ్. గౌరవసూచకంగా తన ‘టోపీ’
తియ్యబోయాడు.
దాని మీద వున్న మూడు సింహాలూ గర్జించటం మాని, ముక్తకంఠంతో ‘మ్యావ’్ మన్నట్లు
అనిపించింది
మేతకు ముందు! నీతికి వెనుక!!
ఒకటి: కామన్ వెల్త్!
రెండు: ఆదర్శ్!!
మూడు:స్పెక్ట్రమ్!!!
ఈ మూడింటి గురించి నీ కేమి తెలియును?
ఇలా ఏ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రంలో నైనా ఇస్తే, సమాధానాలు ఎలాగుంటాయి?
ఒకటి: యూ…జర్ ఛార్జ్
రెండు: పీ…నాల్టీ
మూడు:ఎ…డిషనల్ టాక్స్.
వెరసి ‘యూ. పీ, ఎ’ సర్కారు తిరిగి రెండవ సారి ఎన్నుకున్న ప్రజలకు ఇచ్చే పరిహారం.
దీని పేరే అవినీతి.
‘పోవోయ్’ అంటే-‘మావో’య్ అన్నారు!
వాళ్ళ ముందు
ఇస్లామిక్ టెర్రరిస్టులూ చిన్నవారే.
హిందూ ఉగ్రవాదులూ పిపీలకాలే.
అండర్ గ్రౌండ్ మాఫియాలూ అంగుష్ట మాత్రులే.
వాళ్ళ పేరు చెబితే-
ఒక్క రాష్ట్రమే కాదు. అన్ని రాష్ట్రాలూ హడలెత్తిపోతాయి.
ఆ మాట కొస్తే ప్రభుత్వమే కాదు.
దేశీయ కాంట్రాక్టర్లూ, విదేశీ బహుళజాతి సంస్థలూ బిక్కచచ్చిపోతాయి.
వారున్న చోటా భయమే. వారు లేకున్నా భయమే.
వారి మౌనమూ, అలికిడీ – రెండూ ఆందోళన కరమే.
ఎవరూ వారు? బరినీ, గిరినీ తెగించిన వారు.
‘చావో, మావో’ అని తెంపుచేసుకున్నవారు.
అవతరించినప్పుడు నక్సలైట్లు. ఇప్పుడు మావోయిస్టులు.