![](https://satishchandar.com/wp-content/uploads/2012/09/mulayam-sonia-e1347044148746-150x150.jpg)
అడుగులు తడబడినప్పుడెల్లా బడుగులు గుర్తుకొస్తారు.
తెలుగు దేశం , కాంగ్రెస్ పార్టీలకు నడక సాగటం లేదు. కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం. రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనూ అడుగు తీసి, అడుగు వేయలేక పోతోంది.
టార్చిలైట్ వేసి వెతికినా, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వం- అన్నది కానరావటం లేదు.అక్కడ ప్రధాని మన్ మోహన్ సింగ్ ‘ఉన్నారో, లేదో తెలియదు.’ ఇక్కడ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి -‘ఉంటారో, ఊడతారో’ తెలియదు.
ప్రధాని తన ముఖానికే బొగ్గు ‘మసి’ రాసుకుంటే, ఇక్కడ ముఖ్యమంత్రి తన ‘కేబినెట్’ ముఖానికి ‘వాన్పిక్’ తారు పులిమేశారు.