Category: తకిటతక..తోముతా

ఆంధ్రభూమి దినపత్రికలో ప్రతి ఆదివారం ప్రచురితమవుతున్న కాలమ్

లీడర్‌ రూటే వేరు!

లీడరా? అంటే ఎవరు?

సమాధానం తెలిసినట్టుగానే వుంటుంది కానీ, తెలియనట్టుగా కూడా వుంటుంది. కొన్ని అంతే. ప్రేమికుడా? అంటే? అప్పుడు ఇలాగే చెబుతాం.

కానీ కొందరు మహానుభావులు వుంటారు. మరీ నిర్వచనాలు ఇవ్వరు కానీ, చిన్న చిన్న క్లూలు ఇచ్చి వెళ్ళిపోతారు. గురజాడ అప్పారావు ఇదే పనిచేశారు.

లీడర్‌ గురించి చెప్పలేదు కానీ, పాలిటిష్యన్‌ గురించి చెప్పారు. నిజానికి చెప్పారూ అనటం కన్నా, చెప్పించారూ అనటం సబబు గా వుంటుంది.

‘ఒపీనియన్స్‌ చేంజ్‌ చేస్తేనే కానీ పాలిటిష్యన్‌ కాలేడు’ అని ఓ తుంటరి పాత్ర చేత అనిపిస్తాడు

‘ప్రియమైన’ రాజకీయం!

రాజకీయం ఖరీదయి పోయింది!

బహుశా ఈ మాట అనని పాలిటిష్యన్‌ వుండడు. ఎన్నికల బరిలోకి వచ్చాక అనకుండా వుండటం సాధ్యం కాదు.

కొనాలి. టిక్కెట్టు మాట దేవుడెరుగు. ముందు జనాన్ని కొనాలి. వోటు వెయ్యటానికి మాత్రమే జనమనుకుంటారు. కానీ ‘ఈ సారి పోటీ చేస్తే ఎలా వుంటుందీ’ అని ఆలోచన వచ్చిన నాటి నుంచీ జనం తో పని వుంటుంది.

మౌనమే మహా తంత్రం!

నోరు తెరవటమే కాదు, నోరు మూసుకోవటం కూడా గొప్ప విద్యే. ఎప్పుడూ మాట్లాడని వాడిని, ఓ రెండు నిమిషాలు వేదిక ఎక్కి మాట్లాడమంటే, ఎంత కష్టంగా వుంటుందో; ఎప్పడూ వాగే వాడిని ఒక్క నిమిషం నోరు మూసుకోమనటం కూడా అంతే కష్టంగా వుంటుంది.

అందుకనే మౌనం చాలా కష్టమైన విషయం.

స్కూళ్ళలో టీచర్లు పాఠం చెప్పటానికి ఎంత శక్తి ఖర్చు చేస్తారో తెలియదు కానీ, అంతకు రెండింతలు ‘సైలెన్స్‌’ అనటానికి వెచ్చిస్తారు.

ఛాయ్, ఛాయ్, మోడీ ఛాయ్!

‘ఛాయ్‌’!

ఇది మాట కాదు, మంత్రం.

ఇంత వరకూ మనకు అల్లం ఛాయ్‌, మసాలా ఛాయ్‌, ఇరానీ ఛాయ్‌ మాత్రమే తెలుసు. ఇప్పుడు దేశంలో ఛాయ్‌లో కొత్త బాండ్రింగ్‌ వచ్చింది. అదే ‘మోడీ ఛాయ్‌’

అయితే ఈ ఛాయ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ మాత్రం మణిశంకర్‌ అయ్యరే. బహుశా, నరేంద్రమోడీకి ఇంతటి ప్రచారాన్ని స్వంత పార్టీ(బీజేపీ) నేతలే ఇంతవరకూ కల్పించి వుండరు. కానీ కాంగ్రెస్‌ వాడే అయినప్పటికీ మణి శంకర్ అయ్యర్ ఈ సాహసానికి ఒడిగట్టారు.

అసెంబ్లీ లో ‘పంచ్‌’ శీల!!

‘నమస్కారం సార్‌! తమరంత పలికిమాలిన వారు మరొకరు వుండరట కదా!’ ఇలా సంభాషణ ఎవరయినా మొదలు పెడతరా?

‘పెద్దలు, సంస్కార వంతులు, విజ్ఞులూ అయిన మీరు..’ అని మొదలు పెట్టి , ‘ఇంత నీచ, నీకృష్టమైన స్థితికి దిగజారతారా?’ అంటూ ఏ వక్తయినా ముగిస్తారా?

‘నీ కాళ్లు కడిగి నెత్తి మీద వేసుకుంటా; నీకు జీవితాంతం ఊడిగం చేస్తా; చచ్చి నీ కడుపున పుడతా.’ అని ప్రాధేయపడి, వెంటనే ‘ ఈ రాష్ట్రాన్ని దోచుకోవటం ఆపవయ్యా!’ అని ఏ బాధితుడయినా మొరపెట్టుకుంటాడా?

‘గుర్తు’కొస్తున్నాయీ…!

కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీకి గుర్తు ‘చీపురు’ ఇచ్చారు కాబట్టి సరిపోయింది కానీ, ఏ ‘చిప్పో’ యిస్తే ఏమయ్యేది? ఏమీ అయ్యేది కాదు. ‘చీపురు’ కాబట్టి, అవినీతిని తుడిచిపాడేశాడు- అని అనేశారు. ‘చిప్ప’ కు తగ్గ గొప్ప చిప్పకూ వుంటుంది. దేశంలో నేతలు సంపదను మేసేసి, సామాన్యులకు ‘చిప్ప’ ఇస్తారా?- అని తిరగబడేవాడు.

ఎన్నికల సంఘం ఏ ‘గుర్తు’ ఇచ్చినా, తమ నినాదానికి అనుగుణం మార్చుకునే తెలివి పార్టీ నేతలకు వుంటుంది. అయితే అదృష్ట వశాత్తూ, కొన్ని పార్టీలకు బాగా నప్పే గుర్తులు వస్తుంటాయి.

న్యూయియర్‌కో మాట ఇస్తారా?

మాట ఎవరికయినా ఇవ్వొచ్చు. అదేమన్నా మనసా? ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు.

కావాలంటే మనసు కూడా ఇచ్చి వెనక్కి తీసుకోవచ్చు కానీ, అదెలావుంటుందంటే, పర్సు ఇచ్చి వెనక్కి తీసుకున్నట్టు వుంటుంది. మన పర్సు మనకి వచ్చేస్తుంది. కానీ మన పైసలు మనకి రావు. మనసు అంతే, మన మనసు మనకి వచ్చేస్తుంది. అందులో ప్రేమ వుండదు. ఆ తర్వాత అది మనకు కూడా పనికి రాదు.

మాట అలా కాదు. తీసేస్కోవచ్చు. పాలిటిష్యన్ల చూడండి. నోటూ ఇస్తారు. మాటా ఇస్తారు. అయిదేళ్ళకోసారి వెయ్యిరూపాయిల నోటు ఇస్తారు. మళ్ళీ వెనక్కి తీసుకుంటారా? లేదే! కానీ మాటో..? వెంటనే వెనక్కి తీసేసుకుంటారు.

ఇచ్చట అభిప్రాయాలు అమ్మబడును!

అప్పుడప్పుడూ అభిప్రాయాలతో కూడా పనిబడుతుంది- రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అభిప్రాయంతో పనిబడినట్లు

అంటే ప్రతి సభ్యుడూ అసెంబ్లీకి వెళ్ళినప్పుడు, సరిపడా చొక్కా తొడుక్కొని వెళ్ళినట్టు, ఓ అభిప్రాయం కూడా తొడుక్కుని వెళ్ళాల్సి వుంటుంది. ‘బ్రాండెడ్‌’ చొక్కాలయితే బెటర్‌ గా వుంటాయి. ఏదో ‘మాల్‌’కు ఇలా వెళ్ళి అలా తొడుక్కుని వచ్చేయవచ్చు. ఏవో రెండు మూడు సైజుల్లో చొక్కాలు దొరుకుతాయి. కానీ ఇలాంటి ‘బ్రాండెడ్‌’ చొక్కాలకు ఓషరతు వుంటుంది: చొక్కాలను బట్టి దేహాలను సర్దుబాటు చేసుకోవాలి కానీ, దేహాలను బట్టి అక్కడ చొక్కాలు కుట్టరు

రెండు రెళ్ళు ఒకటి.

అక్షరాలంటేనే కాదు, అంకెలన్నా పడి చచ్చే వాళ్ళుంటారు.

అక్షరాల్లో ఏదో అక్షరం మీద వ్యామోహం పెంచుకోవటం సాధ్యపడదు. ‘అ’ మొదలు ‘బండి-ర’ వరకూ యాభయ్యారు అక్షరాలను ప్రేమిస్తారు.

కానీ అంకెలతో అలా కాదే.. ఏదో ఒక అంకెతో లింకు పెట్టుకోవాలి.

కొందరయితే ఆ అంకె అంకె కాదు. ‘లంకె’ అవుతుంది. కావాలంటే ఆర్టీయే అధికారుల్ని అడగండి.

నాది ‘సేమ్‌ డైలాగ్‌’ కాదు!

రాహుల్‌ మోడీ!

నరేంద్ర గాంధీ!

అనుమానం లేదు. మీరు సరిగానే చదివారు. ఇద్దరూ ప్రధాన అభ్యర్థులే. కానీ రూపాలు మారలేదు. కానీ గొంతులే మారాయి.

రాహుల్‌ గాంధీకి నరేంద్ర మోడీ, నరేంద్రమోడీకి రాహుల్‌ గాంధీ వచ్చి డబ్బింగ్‌ చెప్పినట్లుంది. ఒకరి మాటలు ఒకరు మాట్లాడేస్తున్నారు. వారి సభలకు వచ్చిన వారూ, వాటిని టీవీల ముందు కూర్చుని వింటున్న వారూ, కాస్సేపు తమని తాము గిల్లి చూసుకుంటున్నారు.

కలయా?నిజమా? వైష్ణవ మాయా?

అఫ్‌ కోర్స్‌. కలయే. ఎన్ని ‘కల’యే.

అలిగితేనే ఆమ్లెట్‌!

ప్రేమ వున్న చోటే అలకా వుంటుంది.

ప్రజాస్వామ్యం వున్న చోటా నిరసనా వుంటుంది.

అలకలే లేవంటే ఆప్యాయతలే లేవని అర్థం. ఈ మధ్య కొన్ని కాపురాల్లో అలకల జాడలే కనిపించటం లేదు. ఎవరి వాటా ప్రకారం వారి లాభాలు తీసుకుపోయే భాగస్వామ్య వ్యాపారాల లాగా ఈ సంసారాలు సాగిపోతున్నాయి.

ఆయన అర్థరాత్రి దాటి ఇంటికి వచ్చినా, ‘ఎందుకూ?’ అని ఒక్క మాట కూడా అడగదు.

ఆమె ఏమి వండిపెట్టినా, ‘ఇది బాగుంది. బాగాలేదు.’ అని ఒక్క వ్యాఖ్యా ఆయన చేయడు.

ప్రజాస్వామ్యానికి వసంతమొచ్చింది!

ఉద్యమాలప్పుడు ప్రజలకు అసౌకర్యాలేకాదు, అధికారాలు కూడా ఉచితంగా వస్తాయి. నిన్న మొన్నటి దాకా నడిచిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కానీ, నేడు నడుస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో కానీ, అసౌకర్యాలూ, అధికారాలూ పక్కపక్కనే కనిపించాయి.

అసౌకార్యాలు అనేకం. ప్రయాణమయి వెళ్ళాలనుకుంటాం. బస్సులుండవు. రైళ్ళుంటాయి కానీ, సీట్లుండవు, ప్రయివేటు బస్సులుంటాయి, కానీ అవి ‘గాలి’లో వుంటాయి. అంటే వేగంలో కాదు, ధరల్లో కాదు. దాదాపు ‘ఎయిర్‌'(విమాన)చార్జీల స్థాయిలో వుంటాయి.

అభద్రం కొడుకో!

‘నేను ఇక్కడ అభద్రంగానే వున్నాను. నువ్వు కూడా అభద్రంగా వుంటావని భావిస్తాను’

ఉత్తరాలు రాసినా వెళ్తాయో, లేదో, తెలియదు కానీ, ఒక వేళ తెలంగాణలో వున్నవారు, సీమాంధ్రలో వున్నవారికీ , సీమాంధ్రలో వున్న వారు తెలంగాణలో వున్నవారికీ రాయాల్సి వస్తే, ప్రారంభ వాక్యం ఇలా వుంటుంది.

ఇంతకీ అభద్రత అంటే ఏమిటో..?

‘ఈజీ’ నామాలా? ‘క్రేజీ’నామాలా?

రోజూ పెట్టే ‘నామా’లే, రాజీనామాలయ్యాయి. ఎవరు ఎవరికి పెడతారు? అనుమానమేముంది? నేతలు జనానికి పెడతారు.మట్లాడితే రాజీనామా! అంటే మన నేతల్లో పదవీవ్యామోహ స్థాయి అంత దారుణంగా పడిపోయిందా? కుర్చీలన్నా, అధికారాలన్నా లెక్కలేకుండా పోయిందా? ఎమ్మెల్యే, ఎంపీలే కాకుండా, మంత్రులు కూడా రాజీనామాలకు దూకేస్తున్నారు. ఇంత నిస్వార్థపరత్వం వీరికెలా వచ్చేసింది? చూసే వాళ్ళకి నిజంగానే ఆశ్చర్యంగా వుంటుంది.

మాట వున్నది, తప్పటానికే!!

రాజకీయాలను చూసి, విసిగి, వేసారి తల మాసిపోయిన ఓ ప్రసిధ్ద నాయకుడికి, ఓ రోజు నిజంగానే ప్రజాస్వామ్యం దర్శనం ఇచ్చింది. దానికి ‘మూడు ముఖాలు’ వున్నాయి. (‘సింహాల ముఖాలు కాదండోయ్‌). వాటినే ‘మూడు అంచెలు కాబోలు’ అని అనుకున్నాడు. ఇంతకీ ఆ మూడూ ఏమిటనుకున్నారు? మూడు ‘మ’లు. (ఇంగ్లీషులో అయితే మూడు ‘ఎమ్‌’లు): మనీ, మాఫియా, మీడియా.

గవర్నమెంట్‌ స్కూలా! మార్కెట్‌ రికగ్నిషన్‌ వుందా?!

‘మావాణ్ని ఏ కార్పోరేట్‌స్కూల్లో వేస్తే మంచిదంటావ్‌?’

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, సాటి ఉపాధ్యాయుడి సలహా కోరతాడు.

‘మా ఆవిడకు రెండు రోజులనుంచి జ్వరం, ఏ మల్టీ స్పెషాలిటీస్‌ హాస్పటల్‌లో చేర్పిస్తే మంచిదంటావ్‌?’

ప్రభుతాసుపత్రిలో డాక్టరు, తోటి డాక్టరుని ఆరా తీస్తాడు.

‘మా అల్లుడు కట్నం కోసం మా అమ్మాయిని వేధిస్తున్నాడు. ఏ గూండాతోనైనా బెదిరించాలి. ఎవరికి చెబుతాం?’

ఓ పోలీసు కానిస్టేబుల్‌, మరో కానిస్టేబుల్‌ అభిప్రాయం అడుగుతాడు.

ప్రభుత్వరంగానికే ప్రయివేటు రంగంతో పనిపడింది.

టెలిగ్రామ్ ప్రేమలు వేరు

టెలిగ్రామ్‌ చనిపోయింది.

అవును. టెలిగ్రామ్‌ ఎక్స్‌పైర్డ్‌.

టెలిగ్రామ్‌ మరణ వార్త అందించటమెలా? ఎవరయినా టెలిగ్రామ్‌ ఇస్తే బాగుండును.

టెలిగ్రామ్‌ ఉన్నదే అందుకు. టెలిగ్రామ్‌ అందుకున్న వారు షాక్‌ తినాల్సిందే. అందులో సందేశం అయితే అమితమైన దు:ఖమో, లేక అమితానందమో..!

‘టెలిగ్రామ్‌!’ అని అప్పటి ‘తంతి తపాలా శాఖ’ ఉద్యోగి గుమ్మం బయిట నిలబడితే, కుటుంబం కుటుంబం అంతా గుండెల్లో గుప్పెట్లో పెట్టుకునే వారు.

ఏడుపు గొట్టు పథకాలు!

ఏడ్వని కొడుకును చూసి తల్లిదండ్రులు ఒక్కటే ఏడుపు.

తిట్టినా, చితగ్గొట్టేసినా, నిలువునా చీరేసినా ఏడ్వటం లేదు. పైపెచ్చు ఒంటి మీద చెయ్యేస్తే చాలు-కితకితలు పెడుతున్నట్టుంటుంది వాడికి. దాంతో ఒక్కటే నవ్వు.

వాళ్ళ వృత్తికి ఏడుపే జీవనాధారం. ఏడ్వనిదే పూట గడవదు. పగటిపూట గడిచినా రాత్రి పూట అసలు గడవదు. పేవ్‌మెంట్‌ మీద పడుకోగానే నిద్రపట్టి చావదు. కప్పుకోవటానికి రగ్గున్నా లేకున్నా, కడుపు వెచ్చబెట్టుకోవటానికి ఒక్క ‘పెగ్గు’ అన్నా పడాలి.

శత్రువే సంస్కర్త

శత్రువు మించిన గొప్ప సంస్కర్త ఉండడు. తెల్లని బియ్యంలో నల్లని రాళ్లను తీసినట్టు, ‘ఒప్పుల’

కుప్పలాంటి మన జీవితంలోంచి ‘తప్పుల’ను ఏరి ఇస్తాడు. ఈ పని మిత్రులవల్ల కాదు.
వ్యక్తి విషయంలోనే కాదు. సంస్థ విషయంలోనూ, ఒక పార్టీ విషయంలోనూ ఇదే నిజం.
ఏ రాజకీయ పార్టీ అయినా బాగుపడాలి అంటే, అది శత్రుపక్షం మీద ఆధారపడి ఉంటుంది. ఈ

మధ్యకాలంలో కొన్ని పార్టీలు అలా బాగుపడిపోతున్నాయి. ఒక పార్టీమీద శత్రుపక్షం ఇంత ప్రేమ

చూపిస్తుందంటే, నాటకం అనుకునే వాళ్లం. కానీ అది నాటకం కాదూ, ‘కర్ణాటకం’ అని

బోధపడిపోయింది.

తిన్నదెక్కువ, తినిపించింది తక్కువ!

తిను, తినిపించు, లైఫ్‌ అందించు.

ఇదేదో ‘ఎఫ్‌ ఎమ్‌’ రేడియో నినాదం కాదు. చక్కటి రాజకీయ నినాదం. రాజకీయాల్లో వున్నవారు ‘తినటం’ సర్వ సాధారణం. అయితే తాను మాత్రమే ‘తిని’ ఊరుకునే నేతకు పేరు రాదు. ‘వంద’లో ‘తొంభయి’ తాను తిని, ఇతరుల చేతిలో ‘పద’న్నా పెట్టే వాడు ‘మారాజు’ అయిపోతాడు. ఇదీ అవినీతిలో కూడా జనం తీయగల నీతి. ఇన్నాళ్ళూ ఈ ‘నీతి’కి మార్కెట్టుందనుకున్నారు.

కానీ కళ్ళ ముందు ‘కర్ణాటకం’ కనిపించింది. ‘తిని’ ఊరుకున్న వారే కారు, ‘తిని, తినిపించి’న వారు కూడా 2013 అసెంబ్లీ ఎన్నికలలో మట్టి కరిచారు.