Author: mschandar

M. Satish Chandar, Editor

మమత,’చిరు’త-గొప్ప రాజకీయ చిత్రాలు

‘నానో’ అన్నాలేదు, ‘అమ్మో’ అన్నాలేదు.

మమత చేతికి బెంగాలు సరకారు వచ్చింది కానీ, గుజరాత్‌ పోయిన ‘కారు’ మాత్రం రాదు.

‘టాటా’ అన్నా లాభం లేదు. ‘బైబై’ అన్నా లాభం లేదు.

సింగూరు నుంచి టాటా పూర్తిగా బయిటక పోడు.

‘అన్నా’ అన్నా కుదరదు. ‘తండ్రీ’ అన్నా కుదరదు.

రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మధ్యలో ముంచేసిన ములాయం సింగ్‌ ఉలకరు, పలరు.

‘POETIC INJUSTICE’

No doubt, contemporary Poetry in Telugu is much ahead of the same in any other Indian Language. Politics of Identity-say feminism, Dalit question, outcry of minorities and regional backwardness- have enriched our poetic expression. Telugu poetry has always been quick in adopting all the modern and post-modern techniques. Still, our contribution draws little attention of the poetry lovers in other of the country, if not the world. We have the dearth of translators.Even those who indulge in this craft lack poetic sensibilities.They fail to distinguish poets from non-poets and poetry from non-poetry. They select pieces at their disposal , translate and claim it as the representative ones. Most of the times these English renderings remain literal translations -not literary ones. I wrote an editorial in the year 2000 on this ‘injustice’

‘కలతా’ బెనర్జీ

పేరు : మమతా బెనర్జీ

దరఖాస్తు చేయు ఉద్యోగం: యావజ్జీవ ముఖ్యమంత్రి వైభవం (పశ్చిమ బెంగాల్‌ జ్యోతిబసు రికార్డును కొట్టాలి కదా!)

ముద్దు పేర్లు : కోల్‌కొతా కాళిక, యుపీయే చండిక,

విద్యార్హతలు : సంకీర్ణ రాజకీయాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, ఇంటిపోరులో డాక్టరేట్‌. ‘దీదీ’గిరిలో డిప్లమా.

దళిత ప్రేమ లేఖ

సునీత ఒక దళిత విద్యార్థిని. యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్( పెంట్రల్ యూనివర్శిటీ)లో చదువుతూ వుండేది.అక్కడే చదువుతున్నయోగేశ్వర రెడ్డి అనే అగ్రవర్ణ యువకుణ్ణి ప్రేమించింది. అతడి కారణంగా ఆమె మూడుసార్లు గర్భవతియై అతని సలహా మేరకు అబార్షన్ చేయించుకుంది. కడకు అతడు ఒక రోజున ఆమెకు ఓ వార్త చెప్పాడు తనకు తన వాళ్ళు వేరే రెడ్ల అమ్మాయితో పెళ్ళి నిశ్చయించారని. ఈ వార్త విన్న సునీత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన 1995 లో జరిగింది. ఆమె చనిపోతూ ఒక ఉత్తరం రాసి పెట్టింది. అప్పుడు నేను వార్త దిన పత్రికకు అసోసియేట్ ఎడిటర్ గా వున్నాను. ఈ లేఖను చదివాను. వాడినేమీ చెయ్యలేమా అనిపించింది. ఆమె మరణ వార్తను ప్రముఖంగానే ప్రచురించాను. కానీ ఏదో తెలియని అవమానం. ఇలాంటి సునీతలు ప్రతీ క్యాంపస్ లోనూ రహస్య వేదనను అనుభవిస్తుంటారు కదా- అని పించింది. ఫలితమే ఈ కవిత. తొలుత ఇండియాటుడే సాహిత్య సంచికలో వెలువడింది. నా ’ఆదిపర్వం‘ కవితా సంకలనం ఈ కవితతో ముగుస్తుంది.

THREE WHITE LIES

No ruler has been true to his words in the era of globalization. They have been made to lie. The successive rulers of Andhra Pradesh, say, N.Chandra babu naidu and Y.S.Rajasekhara Reddy have deliberately made the people that the loans granted by the World Bank would alleviate poverty. Poor farmers took away their lives because of indebtedness in the tenures of these two rulers. Y.S.Rajasekhara Reddy did a little to prevent Babu from throwing the state into perpetual bankruptcy when he was the leader of opposition too. Here is the editorial I wrote in 2000 on their double standards.

‘హంగే’ బెంగ!

బెంగ.

2012 లాగే 2014 కూడా ఉంటుందన్న బెంగ.

ఉప ఎన్నికల ఫలితాలే, సార్వత్రిక ఎన్నికల్లోనూ వస్తాయన్న బెంగ.

రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీకి బదులు మూడు ప్రాంతీయ పార్టీలు(తెలుగు దేశంతో పాటు, టీఆర్‌ఎస్‌, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలు) వచ్చేశాయన్న బెంగ.

2014 లో సీమాంధ్రలో త్రిముఖ పోటీ, తెలంగాణాలో చతుర్ముఖ పోటీ వుంటుందన్న బెంగ( బీజేపీ చతికిలపడింది. లేకుంటే పంచముఖ పోటీ వుండేది.)

అన్నింటినీ మించి రాష్ట్రంలో ‘త్రిశంకు సభ’ (హంగ్‌ అసెంబ్లీ) వస్తుందన్న బెంగ.

FORCED FRIENDSHIP

Telugu Desam Party(TDP) and Bharatiya Janata Party(BJP) suffered a humiliating defeat in the By-poll (12June2012) verdict. Both are losing ground in Andhra Pradesh. They had their hey days when they were together. TDP came back to power in 1999 by have electoral truck with BJP, thanks to ‘patriotic rhetoric’ generated by Kargil war. The latter had to lie low and couldn’t play the role of a potential ally or an opposition party . That was how BJP lost all its ground. This was a piece written on their ‘forced friendship’ in the year 2000.

సామాజిక న్యాయమా? ‘సామాజిక వర్గ’ న్యాయమా?

.మాట మాటే. మారదు. కానీ అర్థం మారుతుంటుంది.

కంపు కంపే. మారదు. కానీ ఒకప్పుడు కంపంటే ఇంపయిన వాసన. అంటే సుగంధమన్నమాట. కానీ ఇప్పుడు ఆ ఆర్థం నడవదు. ‘ఆహా,ఏమి ఈ మల్లెల కంపు!’ అని ఇప్పుడంటే బాగుండదు.

చీర చీరే. మారదు. కాకుంటే ఒకప్పుడు పురుషులు కూడా కట్టే వారు. కానీ ఇప్పుడు స్త్రీలు మాత్రమే కడతారు(నిత్యానంద భరితులయన కొందరు పురుష బాబాలు కూడా కడతారనుకోండి. అది వేరే విషయం.) . అర్థం వాడే వేళను బట్టే కాదు, వాడే మనుషులను బట్టి కూడా మారిపోతుంది.

పంచమ వేదం

దాదాపు పాతికేళ్ళ క్రితం నాటి మాట. నేను ఆంధ్రభూమి దినపత్రిక విజయవాడ ఎడిషన్లో చీఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. సిధ్ధార్థ ఇంజనీరింగ్ కాలేజిలో దాకె బాలాజీ అనే విద్యార్థి తనను ప్రిన్సిపాల్ కులం పేరుతో అందరిలోనూ తిట్టినందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వార్తను నేనే రాసి పత్రికలో వేశాను. ఆ తర్వాత మూడేళ్ళకు రాజమండ్రిలో ’కోస్తావాణి‘ అనే ప్రాంతీయ దినపత్రికకు సంపాదకుడిగా వున్నప్పుడు ఇలాంటిదే మరో ఘటన జరిగింది. అక్కడ కూడా ప్రిన్సిపాల్ కులం పేరుతో తిట్టినందుకు డొక్కా పద్మనాభ రావు అనే విద్యార్థి ఒంటిపై కిరోసిన్ పోసుకుని గాయాల పాలయి ఆసుపత్రిలో మరణించాడు. అప్పుడూ వార్త ప్రచురించాను. కానీ లోలోపల రెండు ఘటనలూ కుదిపేస్తూనే వున్నాయి. దు:ఖమో, ఆగ్రహమో తెలీదు కానీ, ఓ సాయింత్రం పూట కవిత్వరూపంలో పెట్టాను. అదే ’పంచమ వేదం‘.

సన్న జాజికి సాక్ష్యముండదు

పర్వతం ఏడ్చింది

నేల చెక్కిళ్ళ మీద లావా

చెట్టు నగలన్నీ వలుచుకుంది

కింద పండుటాకుల వాన

నేను గుండెను దిమ్మరించాను

రాలిన కత్తుల గుత్తులు

కోటికి ఒకడు.. కూటికి లక్షలు!

ఒక్కడు.. ఒకే ఒక్కడు.. నూటికొక్కడు.. కోటికొక్కడు.

సినిమాలకే కాదు, రాజకీయాలకు కూడా మంచి టైటిల్సే. అలాఅని పోరాడే భగత్‌సింగో, అల్లూరి సీతారామ రాజో కోటి మందిలో ఒక్కడు వుంటాడని కాదు. నడుస్తున్నవి పూర్తిగా ఉద్యమ రాజకీయాలయితే, అలా అనుకో వచ్చు. కానీ కాదు. ఇవి పచ్చి అధికార రాజకీయాలు. ఇక్కడ కోటికి ఒక్కడు అంటే, కోటిలో ఒక్కరికి పీట వేసి, కోటి మందినీ సుఖపెట్టిన కీర్తిని కొట్టెయ్యటం.

ఆడితప్పని లంచగొండులు!

‘లంచం తీసుకుంటున్నావ్‌ కదా! పట్టుబడితే..?’

‘అంచమిచ్చి బయిట పడతా!’

ఇది ఒక సంభాషణా శకలం కాదు; ఒక జీవన విధానం.

లంచం వజ్రం లాంటిది. లంచాన్ని లంచంతోనే కొనగలం; కొయ్యగలం. లంచగొండిని కొనాలన్నా లంచమివ్వాలి. వాడిని పట్టుకోవాలన్నా లంచం ఎర చూపాలి.

చినుకంత బతుకు

చిన్నవే. ఎప్పుడూ చూసేవే. అనుక్షణం వినేవే. ఎప్పటిప్పుడు తాకేవే. అను నిత్యం ఆఘ్రాణించేవే. రోజూ రుచి చూసేవే. కొత్తగా, కొత్తగా వుంటాయి. పొద్దుపొడుపు ఎండలో ఆకు మీద మెరిసే మంచు బిందువూ, ప్రశాంత సమయంలో పసిబిడ్డ కేరింతా, రాత్రి పూట మెత్తటి గాలి మోసుకొచ్చిన సంపెంగల సువాసనా, కలత నిద్దురలో నుదుటి మీద అమ్మ చేతి స్పర్శా, నాలుక చివర్న ఉప్పూ,కారం కలిసిన పచ్చిమామిడి కాయ ముక్కా- ఎప్పుడయినా పాతబడ్డాయా? మరి బతుకేమిటి? రెడీమేడ్‌ చొక్కాలా, ఇలా వేసుకుంటే అలా మాసిపోతోంది..!?

పగటి ‘చంద్రుడు’

పేరు : నారా చంద్రబాబు నాయుడు

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘అప్రధాన’ ప్రతిపక్షనేత( పేరుకు ప్రతిపక్షనేతనే. కానీ ఎక్కడా ప్రధానమైన పోటీ ఇవ్వను.)

ముద్దు పేర్లు : పగటి ‘చంద్రు’డు.(ఉంటాను. కానీ కనపడను. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలలోనూ వున్నాను. సీమాంధ్రలో జరిగిన ఉప ఎన్నికలలోనూ వున్నాను. అంకెల్లో మిగలను. అదే ఇబ్బంది.)

బెంగాల్‌ కేకు! కాంగ్రెస్‌ షాకు!!

తెలివి తేటలుండాలే కానీ, భోగాన్ని కూడా త్యాగం ఖాతాలో వేసెయ్యొచ్చు. ప్రేమాట అడే అబ్బాయిలూ, అమ్మాయిలూ ఇలాంటి త్యాగాలు తెగ చేస్తున్నారు లెండి.

‘హనీ, నీకు వేరే సంబంధం చూశారట కదా!’ అంటాడు కుర్రాడు.

‘అవున్రా! రెండు కోట్లు కట్నం ఇచ్చి మరీ కొంటున్నారు పెళ్ళికొడుకుని’ అంటుంది కుర్రది.

ఎక్కడో ప్రాణం చివుక్కుమంది కుర్రాడికి. రెండు కోట్లు రాంగ్‌రూట్లో పోతున్నాయంటే ఎంత బాధ. ఇంకా వాడు తేరుకునే కుర్రది ఇంకో బాంబు వేసింది.

వోటరే విజేత

చివరి నవ్వు వోటరే నవ్వాడు.

గెలిచినవారికి పూర్తి ఆనందాన్ని కానీ, ఓడిన వారికి పూర్తి విషాదాన్ని కానీ మిగల్చలేదు.

ఈ ఉపసమరం అద్దంలాగా ఎవరి నిజరూపాన్ని వారికి చూపించింది. పేరుకు 18 అసెంబ్లీ స్థానాలకూ, ఒక పార్లమెంటు స్థానానికీ జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు. కానీ ఫలితాలు మాత్రం రాష్ట్ర రాజకీయ నాడిని పట్టి ఇచ్చాయి.

యాభయ్యేళ్ళ పాపాయి

అప్పటికి స్వరాజ్యం వచ్చి యాభయేళ్ళయింది. స్వాతంత్ర్యం రాక ముందు అందరూ నడిచే వారు. అది కాస్తా వచ్చేసాక పరుగులే పరుగులు. కేవలం రూపాయి కోసం. అవును రూపాయి కోసమే నవ్వూ, లవ్వూ. రూపాయి కోసమూ వ్యాపారం, ఉద్యమం. రూపాయి కోసమే పెళ్ళిళ్ళూ, పెటాకులూ. అందరూ రూపాయి వెంట పడిపోతునేవువ్నారు. అందుకేనేమో రూపాయి కూడా పడిపోతూనే వున్నది.

సెటిలర్లు కారు.. వారు ‘షటిల’ర్లు!

వలసలు.వలసలు. నిన్నటి వరకూ ప్రాంతం నుంచి ప్రాంతానికి. నేడు పార్టీనుంచి పార్టీకి.

మొదటిరకం వారికి ‘సెటిలర్లు’ అనే ముద్దు పేరు వుండేది. ఎందుకంటే వారు చుట్టపు చూపునకు వచ్చి సెటిలయిపోయేవారు. అయితే రెండోరకం వారికి ఏం ముద్దు పేరు పెట్టవచ్చు? బహుశా ‘షటిల’ర్లు – అంటే సరిపోతుందేమో! ఎందుకంటే ఆ పార్టీనుంచి ఈ పార్టీకే కాదు, ఈ పార్టీనుంచి ఆ పార్టీకి కూడా వెళ్ళ వచ్చు.

కంటి కింది బతుకు

దిగులు. ఎక్కడినుంచో రాదు. నానుంచే. నాకు నచ్చని నానుంచే. జీవించాల్సిన నేను నటించానన్న చికాకు. నాదయిన జీవితంలో నాది కాని భావన. అసహ్యం.

ఈ చికాకులే చిక్కబడితే దిగులు. నన్ను నేను కుదుపు కుంటాను. అయినా దిగులు వీడిపోదే..!? యుధ్ధం.. నా మీద నేను చేసుకునే మహోద్రిక్త సంగ్రామం. నటించే నా మీద, జీవించే నేను చేసే సమరం. గెలుస్తాను. నటన ఓడిపోతుంది. అప్పుడు నిద్దురొచ్చి ముద్దు పెడుతుంది.

పాదుకా ‘ప్రచారా’భిషేకం!

చెప్పుల్లో కాళ్ళు పెట్టటమూ, తప్పుల్లో వేళ్ళు పెట్టటమూ చిన్న విషయాలు కావు. అయినా సరే, చిన్న పిల్లలకు ఈ రెండు పనులూ సరదా. చెయ్యకుండా వుండలేరు. నాన్న చెప్పుల్లోనో, నానమ్మ చెప్పుల్లోనో కాళ్ళు పెట్టటానికి ఉబలాటపడతారు. పెద్దచెప్పులూ, బుల్లి పాదాలూ..! ఇదో ఆట. ఈ ఆటే వారసత్వ రాజకీయం. మిగిలిన దేశాల మాట ఎలా వున్నా, మన దేశంలో ఈ ఆటకు డిమాండ్‌ ఎక్కువ.