పచ్చ బొట్టూ చెరిగీ పోదూలే..!

చరిత్రంటే- పేరూ, ప్రతిష్ఠలు మాత్రమే కాదు; మచ్చలూ, బొట్లూ కూడా. చెరపటం అంత చిన్న విషయం కాదు. పుట్టు మచ్చంటే, పుట్టు మచ్చే. చచ్చినా చెరగదు. పచ్చ బొట్టూ అంతే. మోజు పడి పొడిపించుకున్నంత ‘వీజీ’ కాదు- చికాకు పడి చెరిపేసుకోవటానికి. ముళ్ళపూడి వెంకటరమణ (‘ముత్యాల ముగ్గు’ కోసం) రాసినట్టు, ‘సెరిత్ర.. ! సెరిపేత్తే సెరిగి పోదు, సింపేత్తే సిరిగి పోదు.’

ఈ రహస్యం మన రాష్ట్ర మంత్రులకు అర్థమయి నట్లు లేదు. అందుకే ‘గోడ మీద రాతల్ని’ చెరిపేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ సంక్షేమ పథకం మీదా ‘రాజ’ ముద్ర వుండటానికి వీల్లేదు.(అదే లెండి. రాజశేఖర రెడ్డి ముద్ర.)- అంటూ ‘ధర్మాన’ పీఠం దద్దరిల్లింది.

‘ఈ ఏడుపు మాది’

ఏడుపు ఏడుపే. దానికేదీ సాటి రాదు. ఏడుపుకున్న మార్కెట్టు నవ్వుకు వుండదు. ఎవరన్నా ఏడుపుగొట్టు సినిమా తీయటం- పాపం, ఎదురు డబ్బిచ్చి, టిక్కెట్టు కొని ఏడ్చి వస్తాం. సినిమావాళ్ళకు అనవసరమయిన విషయాల్లో సిగ్గెక్కువ. ఏడుపును ఏడుపని అనరు. సెంటిమెంటు- అంటారు. త్రీడీ సినిమాలు చూడటానికి కళ్ళజోళ్ళు పంచినట్లు, సెంటిమెంటు సినిమాలు చూడటానికి చేతిరుమాళ్ళు పంచిన సందర్భాలు కూడా వున్నాయి.

మరీ ఫిలాసఫీ అనుకోకపోతే- ఏడుపులేకుండా, పుట్టుకా లేదు, చావులేదు. కాకపోతే మనిషి పుట్టినప్పుడు తానేడుస్తాడు, చచ్చినప్పుడు ఇతరులు ఏడుస్తారు. నడమంతరపు సిరి నవ్వు. మధ్యలో వచ్చి మధ్యలోనే పోతుంది.

కుర్చీలందు గోడకుర్చీలు వేరయా!

కుర్చీ కే కాదు, కుర్చీ పక్కన కుర్చీకి కూడా విలువ వుంటుందని రాజనీతిజ్ఞులు ఘోషిస్తున్నారు.

క్లాస్‌ రూమ్‌లో ఒకే ఒక కుర్చీ వుంటుంది. దాంట్లో టీచర్‌ కూర్చుంటారు. దాని పక్కన వేరే కుర్చీ వుండదు. కాబట్టి, విద్యార్థులకు కుర్చీ గురించే తెలుస్తుంది కానీ, పక్క కుర్చీ గురించి తెలీదు. కాక పోతే, హోమ్‌ వర్క్‌ చేయని విద్యార్థుల చేత మాత్రం పూర్వం ‘గోడ కుర్చీ’ వేయించే వారు. అంటే లేని కుర్చీని వున్నట్టుగా భావించి కూర్చోవటం. అది కూడా టీచర్‌ పక్కనే అలా కూర్చోవాలి.

కాబట్టే కుర్చీల గురించి చిన్నప్పుడు కలిగిన జ్ఞానమొక్కటే: ఉన్న కుర్చీలో కూర్చోవటం గౌరవం; లేని కుర్చీలో కూర్చోవటం శిక్ష.

టేకి’టీజీ’ వెంకటేష్‌

పేరు : టి.జి.వెంకటేష్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: హై.సీమ ముఖ్యమంత్రి( అంటే హైదరాబాద్‌తో కూడిన రాయలసీమ ముఖ్యమంత్రి)

ముద్దు పేర్లు :’టేకిటీజీ’ వెంకటేష్‌(నన్ను ఎవరైనా తిడితే ‘టేకిటీజీ’ అంటాను. నేను తిట్టిన ఈ ‘ఐయ్యేఎస్‌’లు ఎందుకు తీసుకోరో?

విద్యార్హతలు : బీ ‘కామ్‌’. (అయినా ఎప్పుడూ ‘కామ్‌’ గా వుండను. ఏదో ఒక ఆందోళన చేస్తూనే వుంటాను)

హోదాలు : ఎంత వ్యాపారం చేసినా, ప్రభుత్వాధికారులు పోజుకోడుతున్నారనే కదా- ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత మంత్రి అయ్యాను. మీరే చెప్పండి

జగన్‌ జర్నీలో ‘మజిలీ’స్‌!

జగన్‌ ప్రణబ్‌కు వోటేశారు.

కాంగ్రెస్‌తో ‘మ్యాచ్‌ ఫిక్సింగా’? వెంటనే అనుమానం.

ఇంకేముంది? యుపీయే అభ్యర్థి, కాంగ్రెస్‌లో కీలకమయిన వ్యక్తి ప్రణబ్‌ ముఖర్జీకి వోటెయ్యటమంటే కాంగ్రెస్‌లో కలవటం కాదూ?

నిజంగానే ఇది ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ల సీజన్‌. సంకీర్ణ రాజకీయ యుగంలో- ఇది సహజం.

కానీ, జగన్‌ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ అంటూ వెంటనే చేసుకోవలసి వస్తే, కాంగ్రెస్‌ తో చేసుకోరు. ఒక వేళ అలా చేసుకుని కలిసిపోతే, అది తన పార్టీ(వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ)కి మంచిది కాదు, కాంగ్రెస్‌ పార్టీకీ మంచిది కాదు. నిన్న కత్తులు దూసుకున్న వారు నేడు కౌగలించుకుంటే, అంతే వేగంగా రెండు పార్టీల్లోని కార్యకర్తలూ చెయ్యలేరు.

మోడీ, గోద్రా, ఒక తమిళ అమ్మాయి!?

దేహమంటే మట్టి కాదోయ్‌, దేహమంటే కోర్కెలోయ్‌!

ఇలాగని ఎవరంటారు? ‘దేహ’ భక్తులంటారు. దేశ భక్తుల్లాగే దేహభక్తులుండటం విడ్డూరం కాదు. కానీ ‘దేశభక్తుల్లో’ కూడా ‘దేహ’భక్తులుండం ఆశ్చర్యమే.

సర్వసంగ పరిత్యాగులూ, కాషాయాంబర ధారులూ ‘నిత్యానందులయి’ దేహాల కోసం పరితపించటం కొత్త విషయమేమీ కాదు.

ప్రజాసేవ కోసం తమ అణువణువూ అర్పించేస్తామని ఊరేగే రాజకీయనాయకులూ, ప్రజా ప్రతినిథులూ, దేశభక్తులూ, ఇలా ‘దేహాల వేట’లో వుండటం కూడా వింత కాదు కానీ, దొరికి పోవటం వార్త. ఇటీవలి కాలంలో ఇలాంటి ‘శృంగార పురుషుల’ భాగోతాలు ప్రసారం చేసి బుల్లితెర మరింత చిన్నబోతోంది.

‘ఏటూజెడ్‌’ యూరప్ప!

పేరు : బి.ఎస్‌. యెడ్యూరప్ప

దరఖాస్తు చేయు ఉద్యోగం: ‘నాజీ’ ముఖ్యమంత్రి. (అంటే మామూలు ‘మాజీ’ ముఖ్యమంత్రి అని కాదు. నియతలా శాసించే ముఖ్యమంత్రి అన్న మాట.)

ముద్దు పేర్లు : ఎ-టూ-జెడ్‌ యూరప్ప(కర్ణాటక లో బీజేపీ యూనిట్‌ వరకూ ఆది నుంచి అంతం వరకూ నేనే.)

విద్యార్హతలు : గుమస్తా పనికి సరిపోయే చదువనుకునేరు. అదే సమస్తానికి సరిపోతుంది. నా క్యాంపులో ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో, లెక్కలేసుకోవటానికి ఆ మాత్రం చదువు చాలదా?

సిఎం సీటు ‘బీసీ’కా? ‘సీబీ’కా?

వంద సీట్లు. వెయ్యి కోట్లు. లక్ష ఫీట్లు.

ఇవీ బీసీల వోట్ల కోసం చంద్రబాబు పాట్లు.

ఇది విజన్‌ 2020 కాదు, రీజన్‌ 2014.

అనుమానం లేదు. ఇది ఎన్నికల గణితమే. ఆయన లెక్కల్లో మనిషి. ఇంతకు ముందు ఎన్నికల్లో ఇలాగే ‘నగలు బదలీ’ లెక్కలు వేశారు. ‘ఆల్‌ ఫ్రీ’ కూడికలు వేశారు. కానీ జనానికి ‘తీసివేత’లే అర్థమయ్యాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ‘తీసి వేశారు’.

జూనియర్‌ ఆట అదుర్స్‌!

కోపం జూనియర్‌ ఎన్టీఆర్‌ మీద.

కేకలు కొడాలి నాని మీద.

తెలుగుదేశం పార్టీ నాయకుల తాజా వైఖరి ఇది. అధినేత చంద్రబాబు నాయుడు ఆంతర్యం కూడా ఇదే.

జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే చంద్రబాబుకు ప్రియమా? భయమా?

తొలుత ప్రియంగా అనే అనిపించింది. కారణం ఒక్కటే. జూనియర్‌ గ్లామరున్న ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుడు.

‘రాణి’నీతి లేదా?

అప్పుడు రాణిని ‘కొప్పుపట్టి ఈడ్చుకు రమ్మని’ ధుర్యోధనుడు శాసిస్తే, దుశ్సాసనుడు అమలు చేస్తాడు. నిండు సభలో వలువలు వలుస్తారు. ఉత్త ‘నీతి’ని వల్లించే పెద్దలు అచేతనులయి చూస్తారు.

భారతం, భారతమే. ‘కళ్ళుమూసుకుని’ పాలించే పాలకులున్న చోట, దేశంలోని అంగుళం, అంగుళమూ కురుసభగానే మారిపోతుంది. అందాకా గువహతి(అసోం)లో ఒక ‘ఆరు బయిట’ (అదేలెండి ‘బారు బయిట’) నాలుగు రోజుల క్రితం ఈ కురుసభను నిర్వహించారు.

శిశువు నేడు లేచెను

రెండు దశాబ్దాల క్రితం చుండూరు(ప్రకాశం జిల్లా)లో ఇప్పుడు లక్ష్మీపేటలో జరిగినట్లే దళితుల మీద దాడి చేశారు. ఇప్పుడు చంపింది కాపుకులస్తులయితే, అప్పడు చంపింది రెడ్డి

భూస్వాములు. అప్పడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోవుంది. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమిల్లి జనార్థన రెడ్డి. పంటపొలాల్లో దళితకూలీలను తరిమి తరిమి చంపి వారి

శవాలను గోనె సంచుల్లో మూట కట్టి మురికి కాలువలో పడేశారు. ఈ ఘటనకు దేశం నలుమూలలా దళితుల తల్లడిల్లారు. దళిత సంఘాల వారు వారు శవాలను వెలికి తీసి, నిరసనగా

ఊరి మధ్యలో పాతి పెట్టారు. పాత్రికేయుడిగా వార్త కోసం వెళ్ళి చూసి వచ్చాక నా మనసు మనసులో లేదు. అప్పడు రాసిందే ఈ కవిత. తెలుగు కవిత్వాభిమానులకు

పరిచితమయినదే. అయిన లక్ష్మీపేట దాడి నేపథ్యంలో ఎందుకో మిత్రులతో పంచుకోవాలనిపించింది.

ఆవేశంలో ఆమె సగం!

సమస్య అంటేనే స్త్రీ. స్త్రీ అంటేనే సమస్య. ఇది ఇంటి భాగోతం.

సమరం అంటేనే స్త్రీ. స్త్రీ అంటేనే సమరం. ఇది వీధి భారతం.

కేవలం రెండే రెండు దశాబ్దాలలో దేశ పోరాట చిత్రపటాన్ని మార్చేశారు స్త్రీలు. ఇలా అనగానే కేవలం స్త్రీలుగా తమ సమస్యలపైనే తాము పోరాటం చేశారనే నిర్థారణకు రావచ్చు. పురుషులు సైతం ఎదుర్కొనే ఇబ్బందుల మీద కూడా పిడికిళ్లు బిగించారు.

కాకుంటే, తమ పోరాటాలను వెను వెంటనే రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని మాత్రం వీరు భావించలేదు. అదే జరిగితే, పాలన మొత్తాన్ని తలక్రిందులు చేయగలుగుతారు.