Tag: K.Chandra Sekhara Rao

కదలని’చెయ్యి’- వదలని’గులాబి’!!

తెలంగాణ సమస్య తెగిపోతుంది, మబ్బు విడిపోతుంది.

ఇది తెలంగాణలో ఆశావాదుల జోస్యం.

తెలంగాణ సమస్య జటిలమవుతుంది. మళ్ళీ రెండు ప్రాంతాల్లో చిచ్చు రేగుతుంది.

ఇది తెలంగాణలోని నిరాశావాదుల భయం.

బహుశా, కేంద్రం నిర్ణయం రెంటికీ మధ్య వుంటుంది

ప్రజాస్వామ్యంలో రాచరికం!

దేవుడు లేక పోతే ఏమయింది? వెంటనే ఒక దేవుణ్ణి సృష్టించండి. ఇదో పాత సూక్తి. రాజులేక పోతే నష్టమేముంది? వెంటనే రాజునో లేక రాజునో సృష్టించండి. మన దేశ వర్తమాన చరిత్రను చూసినప్పుడెల్లా ఈ సూక్తిని ఇలా కొత్తగా మార్చుకోవాలనిపిస్తుంది. ఆలోచించటానికి బధ్ధకమయినప్పుడో, మృత్యువుభయపెట్టినప్పుడో-కొందరు నిజంగానే దేవుడుంటే బాగుండుననుకుంటారు. ఉన్నట్టు విశ్వసిస్తారు. ప్రజాస్వామ్యం వచ్చేశాక కూడా, రాచరికం మనస్సులో వుండి పోతుంది. కారణం కూడా అంతే.

తుంటరి ‘చేతి’కి ఒంటరి ‘గులాబి’

ఒకప్పుడు ‘సమైకాంధ్ర’ నినాదమిచ్చిన సీమాంధ్ర నేతలెవరూ, తెలంగాణ గడ్డ మీద కేసీఆర్‌కు ఎదురు నిలువ లేదు. ఆ మాట కొస్తే ఉద్యమం ఉధ్ధృతం అయ్యాక కాలు కూడా మోప లేదు. అలాంటిది- ఒకప్పుడు ఇదే కారణం మీద మహబూబా బాద్‌ నుంచి వెనుతిరిగిన వై.యస్‌ జగన్‌, తన తల్లి(విజయమ్మ)నీ, చెల్లి(షర్మిల)నీ తెలంగాణ ఉప ఎన్నికకు ప్రచారానికి పంపిస్తే, కేసీఆర్‌ చోద్యం చూశారు. అంతే కాదు, పరకాలలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ‘నువ్వా-నేనా’ అన్నంతటి పోటీ ఇచ్చి ముచ్చెమట్లు పోయించారు. స్వల్ప ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ పరువు నిలుపు కున్నది కానీ, పట్టు కోల్పోయింది.

‘డైలాగుల్లేని పాత్ర’

గురూజీ?
వాట్ శిష్యా!

‘విజయశాంతి టీఆర్ఎస్ లో వున్నట్లా? బీజేపీలోనే వున్నట్లా?’
‘టీఆర్ఎస్ లోనే వున్నారు శిష్యా. అయినా ఆ ఆనుమానం దేనికి?’