
నా (సతీష్ చందర్) 17 వ పుస్తకం ’నిగ్రహ వాక్యం‘ (సాహిత్య విమర్శ) గ్రంధాన్ని అక్టోబరు 29 సాయింత్రం సుందరయ్య విజ్నాన కేంద్రం, మినీ హాలులోప్రముఖ కవి కె.శివారెడ్డి ఆవిష్కరించారు. సభకు దిగంబరకవితోద్యమ సారధి నగ్నముని అధ్యక్షత వహించారు. మొత్తం నాతో పాటు పది మంది మాట్లాడారు. ( నాది ’స్పందన‘ సమర్పణే లెండి. నేను వందన సమర్పణను అలా అంటుంటాను.) అయినా ఎవరి పరిశీలన వారు చేశారు